NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vande Bharat Express : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్- నాగ్‌పూర్ రూట్‌లో వందేభారత్.. ఎప్పటినుంచి అంటే? 
    తదుపరి వార్తా కథనం
    Vande Bharat Express : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్- నాగ్‌పూర్ రూట్‌లో వందేభారత్.. ఎప్పటినుంచి అంటే? 
    సికింద్రాబాద్- నాగ్‌పూర్ రూట్‌లో వందేభారత్.. ఎప్పటినుంచి అంటే?

    Vande Bharat Express : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్- నాగ్‌పూర్ రూట్‌లో వందేభారత్.. ఎప్పటినుంచి అంటే? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 09, 2024
    01:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సికింద్రాబాద్ నుండి మరో వందే భారత్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు.

    సికింద్రాబాద్-నాగ్‌పూర్ మార్గంలో ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడవనుంది. సాధారణ రైలు ప్రయాణంతో పోలిస్తే 45 నిమిషాలు తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

    సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య 578 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణానికి 8 గంటల సమయం పడుతుండగా, వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే 7.15 గంటల్లో నాగ్‌పూర్ చేరుకోవచ్చు. ఈనెల 15న ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు.

    ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, రైలు నాగ్‌పూర్ నుండి ఉదయం 5 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది.

    వివరాలు 

    మంగళవారం సెలవు.. 

    తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్ నుండి బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుతుంది.

    రైలు కాజీపేట్, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఆగుతుంది. విశాఖపట్టణం-సికింద్రాబాద్(20833) మధ్య నడిచే వందే భారత్ రైలు వారంలో ఆరు రోజులపాటు సేవలు అందిస్తుంది.

    ఆదివారం సెలవుగా ఉండగా, ప్రస్తుతం ఈ సెలవు మంగళవారానికి మార్చారు. ఈ మార్పు డిసెంబర్ 10 నుండి అమల్లోకి రానుంది.

    ఇక విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలు కూడా మంగళవారాల్లో అందుబాటులో ఉండదు.

    ఈ మార్పులు కూడా డిసెంబర్ 10 నుండి అమల్లోకి వస్తాయి. ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.అధికారులు ఇటీవలే ఏలూరు స్టేషన్లో కూడా ఆపాలని నిర్ణయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! సికింద్రాబాద్
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025