Page Loader
Narendra Modi: భారతదేశపు తొలి 'వందే మెట్రో' సర్వీసును ప్రారంభించనున్న ప్రధాని మోదీ 
భారతదేశపు తొలి 'వందే మెట్రో' సర్వీసును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Narendra Modi: భారతదేశపు తొలి 'వందే మెట్రో' సర్వీసును ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2024
06:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సోమవారం భారతదేశపు మొదటి "వందే మెట్రో" సర్వీసును ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్-భుజ్ మధ్య నడిచే వందే మెట్రో, పూర్తిగా రిజర్వ్ చేయని ఎయిర్ కండిషన్డ్ రైలు సర్వీసుగా ఉండనుంది. ప్రయాణికులు టిక్కెట్లు ముందుగా రిజర్వ్ చేయకుండా, ప్రయాణానికి కొద్దిసేపటి ముందు టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఈ రైలులో 2,058 మంది నిల్చుని, 1,150 మంది కూర్చుని ప్రయాణించవచ్చు.

Details

గంటకు 110 కిలోమీటర్ల వేగం

అహ్మదాబాద్-భుజ్ మధ్య నడిచే వందే మెట్రో సర్వీస్, 360 కిమీ దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో చేరుకుంటుంది. రైలు గరిష్ట వేగం గంటకు 110 కిమీ ఉంటుంది. ఈ రైలు భుజ్ నుండి ఉదయం 5:05 గంటలకు బయలుదేరి, ఉదయం 10:50 గంటలకు అహ్మదాబాద్‌ జంక్షన్‌ చేరుకుంటుంది. మొత్తం తొమ్మిది స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. వందే మెట్రో రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లతో రూపొందించారు. రైలులో అత్యాధునిక భద్రతా వ్యవస్థలు ఉన్నాయి.

Details

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వందే మెట్రో రూపకల్పన వందే భారత్ రైలు తరహాలోనే ఉంటుంది. ప్రధాని మోదీ తన పర్యటనలో వందే మెట్రో సర్వీసును ప్రారంభించడమే కాకుండా, గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్‌పో (రీ-ఇన్వెస్ట్ 2024) 4వ ఎడిషన్‌ను కూడా ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్‌లో ₹8,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అహ్మదాబాద్-గాంధీనగర్ రెండో దశ మెట్రో రైలు సర్వీసును కూడా ప్రారంభించనున్నారు.