NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Narendra Modi: భారతదేశపు తొలి 'వందే మెట్రో' సర్వీసును ప్రారంభించనున్న ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    Narendra Modi: భారతదేశపు తొలి 'వందే మెట్రో' సర్వీసును ప్రారంభించనున్న ప్రధాని మోదీ 
    భారతదేశపు తొలి 'వందే మెట్రో' సర్వీసును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    Narendra Modi: భారతదేశపు తొలి 'వందే మెట్రో' సర్వీసును ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 14, 2024
    06:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సోమవారం భారతదేశపు మొదటి "వందే మెట్రో" సర్వీసును ప్రారంభించనున్నారు.

    అహ్మదాబాద్-భుజ్ మధ్య నడిచే వందే మెట్రో, పూర్తిగా రిజర్వ్ చేయని ఎయిర్ కండిషన్డ్ రైలు సర్వీసుగా ఉండనుంది.

    ప్రయాణికులు టిక్కెట్లు ముందుగా రిజర్వ్ చేయకుండా, ప్రయాణానికి కొద్దిసేపటి ముందు టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు.

    ఈ రైలులో 2,058 మంది నిల్చుని, 1,150 మంది కూర్చుని ప్రయాణించవచ్చు.

    Details

    గంటకు 110 కిలోమీటర్ల వేగం

    అహ్మదాబాద్-భుజ్ మధ్య నడిచే వందే మెట్రో సర్వీస్, 360 కిమీ దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో చేరుకుంటుంది.

    రైలు గరిష్ట వేగం గంటకు 110 కిమీ ఉంటుంది. ఈ రైలు భుజ్ నుండి ఉదయం 5:05 గంటలకు బయలుదేరి, ఉదయం 10:50 గంటలకు అహ్మదాబాద్‌ జంక్షన్‌ చేరుకుంటుంది.

    మొత్తం తొమ్మిది స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.

    వందే మెట్రో రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లతో రూపొందించారు. రైలులో అత్యాధునిక భద్రతా వ్యవస్థలు ఉన్నాయి.

    Details

    పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

    వందే మెట్రో రూపకల్పన వందే భారత్ రైలు తరహాలోనే ఉంటుంది.

    ప్రధాని మోదీ తన పర్యటనలో వందే మెట్రో సర్వీసును ప్రారంభించడమే కాకుండా, గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్‌పో (రీ-ఇన్వెస్ట్ 2024) 4వ ఎడిషన్‌ను కూడా ప్రారంభించనున్నారు.

    అహ్మదాబాద్‌లో ₹8,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

    అహ్మదాబాద్-గాంధీనగర్ రెండో దశ మెట్రో రైలు సర్వీసును కూడా ప్రారంభించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఇండియా

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    Narendra Modi: ప్రసంగంలో తన రికార్డును తానే బ్రేక్ చేసిన ప్రధాని భారతదేశం
    Vinesh Phogat: ఒలింపిక్స్‌లో భారత క్రీడాబృందంతో ముచ్చటించిన ప్రధాని.. వినేష్'వీర పుత్రిక' అన్న మోదీ     క్రీడలు
    Narendra Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన విద్యార్థులు  భారతదేశం
    PM Modi Ukraine Visit: 2022 రష్యా దాడి తర్వాత తొలిసారిగా మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు  ఉక్రెయిన్

    ఇండియా

    Kangana Ranaut: 'ఇది చాలా చిన్న విషయం'.. జయా బచ్చన్‌ వివాదంపై కంగనా రనౌత్‌ స్పందన పార్లమెంట్
    Vinayaka Chavithi Festival:వీధుల్లో వినాయకుడి ఉత్సవాలకు నాంది పలికింది ఎవరు? అసలు కారణం ఇదే  వినాయక చవితి
    UP: డబ్బులివ్వలేదని రక్షించలేదు.. నదిలో కొట్టుకుపోయిన ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరక్టర్  ఉత్తర్‌ప్రదేశ్
    Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 100 పైగా రోడ్లు మూసివేత, 8 జిల్లాలకు హెచ్చరికలు  హిమాచల్ ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025