NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Namo Bharat Rapid Rail: వందే మెట్రో రైలు పేరు మార్పు.. ఇక నమో భారత్ ర్యాపిడ్ రైలు 
    తదుపరి వార్తా కథనం
    Namo Bharat Rapid Rail: వందే మెట్రో రైలు పేరు మార్పు.. ఇక నమో భారత్ ర్యాపిడ్ రైలు 
    వందే మెట్రో రైలు పేరు మార్పు.. ఇక నమో భారత్ ర్యాపిడ్ రైలు

    Namo Bharat Rapid Rail: వందే మెట్రో రైలు పేరు మార్పు.. ఇక నమో భారత్ ర్యాపిడ్ రైలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 16, 2024
    01:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు రూపొందించిన వందే మెట్రో (Vande Metro) రైలు పేరు ఇప్పుడు మారింది.

    ఇకపై దీనిని నమో భారత్‌ ర్యాపిడ్ రైల్‌ (Namo Bharat Rapid Rail)గా పిలుస్తారు.

    ఈ పేరుమార్పు అనౌన్స్‌మెంట్ దేశంలో తొలి వందే మెట్రో సేవను ఈరోజు (సెప్టెంబర్ 16) గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది.

    ప్రస్తుతం దేశంలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (Vande Bharat Express) వేగంగా పరుగులు తీస్తున్నాయి.

    తాజాగా అమృత్‌ భారత్‌ రైలు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో, ఈ రోజు నుంచి వందే మెట్రో కూడా పట్టాలెక్కనుంది.

    వివరాలు 

    కనీస టికెట్‌ ధర రూ.30

    వందే మెట్రో పూర్తి అన్‌రిజర్వ్‌డ్‌ ఎయిర్‌ కండీషన్‌ కోచ్‌లతో రూపొందించబడింది.ఈరైలులో 1150 మంది కూర్చుని,2058 మంది నిల్చుని ప్రయాణించవచ్చని పశ్చిమ రైల్వే వెల్లడించింది.

    అహ్మదాబాద్-భుజ్‌ల మధ్య 9 స్టాపుల వద్ద ఆగే ఈ రైలు,360 కిలోమీటర్ల దూరాన్ని 5గంటల45 నిమిషాల్లో చేరుకుంటుందని చెప్పింది.

    ఈ రైలు గరిష్ఠంగా 110కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని వివరించింది.ప్రతిరోజు ఉదయం 5.05 గంటలకు భుజ్‌ నుంచి ప్రారంభమై,10.50 గంటలకు అహ్మదాబాద్‌ జంక్షన్‌ చేరుకుంటుందని పశ్చిమ రైల్వే (అహ్మదాబాద్‌) పీఆర్‌ఓ ప్రదీప్‌ శర్మ తెలిపారు.

    ప్రయాణికులు తక్షణమే టికెట్‌ కొనుక్కొని రైలు ఎక్కొచ్చని వివరించారు.వందే భారత్‌ తరహాలోనే,ఈ రైలును పూర్తిగా ఏసీ కోచ్‌లు, కవచ్‌ వంటి భద్రతా సదుపాయాలతో రూపొందించినట్లు తెలిపారు.

    కనీస టికెట్‌ ధర రూ.30గా నిర్ణయించినట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    గుజరాత్

    Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Arabian Sea: దాడులను ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో 3 యుద్ధనౌకలను మోహరించిన భారత్ అరేబియా సముద్రం
    Gujarat 2024 : నూతన సంవత్సరం వేళ.. సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ రికార్డ్‌ భారతదేశం
    Girl In Borewell: బోరు బావిలో పడ్డ చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025