NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీ వాసులకు మరో గుడ్ న్యూస్.. రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు
    తదుపరి వార్తా కథనం
    ఏపీ వాసులకు మరో గుడ్ న్యూస్.. రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు
    విజయవాడ - చెన్నై నగరాల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్

    ఏపీ వాసులకు మరో గుడ్ న్యూస్.. రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 03, 2023
    01:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రాష్ట్రానికి కేటాయించింది.

    విజయవాడ - చెన్నై నగరాల మధ్య ఈ నెల 7 నుంచి వందేభారత్ రైలు రాకపోకలను ప్రారంభించనుంది. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి.

    దేశవ్యాప్తంగా మరో ఐదు వందే భారత్ రైళ్లకు వర్చువల్ విధానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేయనున్నారు. అందులో భాగంగానే ఓ రైలు విజయవాడ - చెన్నై మధ్య నిర్వహించనున్నారని తెలుస్తోంది.

    ఇప్పటికే రాష్ట్రంలో రెండు వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో రైలు సర్వీస్ అందుబాటులో ఉంది. తాజాగా మూడో రైలు రానుంది.

    DETAILS

    ఏపీ వాసులకు మరో గుడ్ న్యూస్.. రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు

    ఈ నెల 8 నుంచి మూడో రైలు సర్వీస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని సమాచారం. రైలు ఆగే స్టేషన్లు, రాకపోకల షెడ్యూల్, టికెట్ ధరలు తదితర వివరాలను మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

    విజయవాడ - రేణిగుంట మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రేణిగుంట మీదుగా రైలును నడపాలని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.

    ఈ మేరకు విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి (తమిళనాడు) మీదుగా చెన్నై చేరనుంది. తిరుగు ప్రయాణంలోనూ అదే మార్గంలో గమ్యస్థానం చేరుకోనుంది.

    విజయవాడ - తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైలును నడిపించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    విజయవాడ సెంట్రల్
    చెన్నై

    తాజా

    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్
    UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
    RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు! ఆర్ బి ఐ
    EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు ఈపీఎఫ్ఓ

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! సికింద్రాబాద్
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్

    విజయవాడ సెంట్రల్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్ విద్యుత్
    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ

    చెన్నై

    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ బైక్
    భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన అమెరికా
    ప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్ తాజా వార్తలు
    చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్  ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025