NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Vallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ 
    వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్

    Vallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 14, 2025
    08:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

    హైదరాబాద్‌లో వంశీని అరెస్టు చేసిన పోలీసులు, గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.

    ప్రభుత్వం తరఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్‌, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

    అర్ధరాత్రి 2.30 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రామ్మోహన్, ప్రాసిక్యూషన్‌ వాదనలకు అనుకూలంగా తీర్పునిస్తూ, వంశీతో పాటు అతడి అనుచరులు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్‌లకు రిమాండ్‌ విధించారు.

    అనంతరం, పోలీసులు వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

    వివరాలు 

    వంశీ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు 

    పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో వంశీపై కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    సత్యవర్ధన్‌ను బెదిరించడంలో వంశీ ప్రధాన పాత్ర పోషించాడని పేర్కొన్నారు. మరణ భయంతోనే సత్యవర్ధన్‌ వంశీ అనుచరుల ఆదేశాలను పాటించాడని పోలీసులు తేల్చారు.

    పోలీసుల నివేదిక ప్రకారం, "వంశీకి నేర చరిత్ర ఉంది. అతనిపై ఇప్పటివరకు 16 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

    ఎన్టీఆర్‌ జిల్లా సీపీ ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడకు తరలించాం.

    ఈ కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న రామును కలవాలని వంశీ బలవంతం చేశాడు.

    అలాగే, సత్యవర్ధన్‌ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి ఏ7, ఏ8 నిందితులు కీలకంగా వ్యవహరించారు" అని పోలీసులు తెలిపారు.

    వివరాలు 

    అరెస్టు & విచారణ 

    టీడీపీ కార్యాలయంలో పని చేసే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో, గురువారం ఉదయం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో వంశీని అరెస్టు చేశారు.

    వంశీ అనుచరులైన లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్‌లపై అట్రాసిటీ యాక్ట్‌ కింద నాన్-బెయిలబుల్‌ సెక్షన్లతో కేసు నమోదు చేశారు.

    వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేయగా, లక్ష్మీపతి మరియు శివరామకృష్ణ ప్రసాద్‌లను విజయవాడలో అరెస్టు చేశారు.

    అంతేకాక, విజయవాడ పడమట పోలీస్‌ స్టేషన్‌లో సత్యవర్ధన్‌ వాగ్మూలం నమోదు చేశారు.

    అనంతరం వంశీని విజయవాడకు తరలించి, కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు.

    పోలీసు విచారణ అనంతరం, నిందితులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వల్లభనేని వంశీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వల్లభనేని వంశీ

    టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు గన్నవరం
    Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీని వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు గన్నవరం
    Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు గన్నవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025