NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Himachal crisis: మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా.. హిమాచల్‌లో ముదురుతున్న సంక్షోభం
    తదుపరి వార్తా కథనం
    Himachal crisis: మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా.. హిమాచల్‌లో ముదురుతున్న సంక్షోభం
    Himachal crisis: మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా.. హిమాచల్‌లో ముదురుతున్న సంక్షోభం

    Himachal crisis: మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా.. హిమాచల్‌లో ముదురుతున్న సంక్షోభం

    వ్రాసిన వారు Stalin
    Feb 28, 2024
    11:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత ముదురుతోంది.

    తాజాగా సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేశారు.

    ఈ మేరకు బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన విషయాన్ని వెల్లడించారు.

    సుఖు ప్రభుత్వంపై విక్రమాదిత్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అవమానించే ప్రయత్నం కూడా జరిగిందని ఆయన చెప్పడం గమనార్హం.

    హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడే విక్రమాదిత్య సింగ్. ఆయన సుఖు ప్రభుత్వంలో పీడబ్ల్యూ మంత్రిగా ఉన్నారు.

    తాము ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే ఉన్నామన్నారు. ప్రస్తుతానికి తాను ఈ ప్రభుత్వంలో కొనసాగడం సరికాదని చెప్పాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అందుకే మంత్రివర్గం నుంచి బయటకు వెళ్తున్నట్లు చెప్పారు.

    హిమాచల్ 

    ఎమ్మెల్యేల గొంతు నొక్కారు : విక్రమాదిత్య సింగ్ 

    హిమాచల్‌లో అందరి సహకారంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని విక్రమాదిత్య సింగ్ అన్నారు.

    ప్రభుత్వ పనితీరు గురించి తాను ఎప్పుడు నోరు విప్పలేదన్నారు. తనకు పదవి ముఖ్యం కాదని, ప్రజల నమ్మకమే ముఖ్యమన్నారు.

    ఎమ్మెల్యేల గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని, అందుకే నేడు ఈ పరిస్థితి వచ్చినట్లు ఆయన చెప్పారు.

    ఈ అంశాన్ని పార్టీ హైకమాండ్‌ ముందు తాను ఎప్పటికప్పుడు లేవనెత్తుతూనే ఉన్నానని వివరించారు.

    కానీ హైకమాండ్ తీసుకోవలసిన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోలేదన్నారు. వాగ్దానాలు ఇవ్వగానే సరిపోదని, వాటిని పూర్తి చేయాలన్నారు.

    ముఖ్యమంత్రిని తానెప్పుడూ గౌరవిస్తానని విక్రమాదిత్య అన్నారు. ఏడాది పాటు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచామన్నారు. కానీ తమకు అవమానించారని ఆయన పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హిమాచల్ ప్రదేశ్
    కాంగ్రెస్
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    హిమాచల్ ప్రదేశ్

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు ప్రయాణం
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ భారతదేశం

    కాంగ్రెస్

    Telangana: కీలక నేతలను సలహాదారులుగా నియమించిన తెలంగాణ సర్కార్  తెలంగాణ
    YS Sharmila: ఏపీలో నియంత పాలన నడుస్తోంది: జగన్ ప్రభుత్వంపై షర్మిల ధ్వజం  వైఎస్ షర్మిల
    Congress: అసోంలో కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై దాడి  భారత్ జోడో న్యాయ్ యాత్ర
    Rahul Gandhi: అసోంలో ఉద్రిక్తత.. ఆలయంలోకి వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ  రాహుల్ గాంధీ

    తాజా వార్తలు

    Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు పంజాబ్
    PM Modi: అరేబియా సముద్రంలో మునిగి.. ద్వారకలో ప్రధాని మోదీ పూజలు నరేంద్ర మోదీ
    Rahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ భారత్ జోడో న్యాయ్ యాత్ర
    Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప కన్నుమూత  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025