
Chandrababu: 'యోగాంధ్ర'తో విశాఖకు కొత్త గుర్తింపు : సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'యోగాంధ్ర' కార్యక్రమం ఘనవిజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 'యోగాంధ్ర ద్వారా చరిత్ర సృష్టించాం. ఈ కార్యక్రమానికి ప్రకృతి, వరుణ దేవుడు కరుణించారు. యోగాంధ్రలో పాల్గొనడానికి దాదాపు 3.3 లక్షల మంది వచ్చారు. తొలిసారి రెండు గిన్నిస్ రికార్డులను సృష్టించాం.
Details
2.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్
రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కోసం 2.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొదట 25 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇవ్వాలని అనుకున్నాం, కానీ ఇప్పుడు 1.80 కోట్ల మందికి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. యోగా గేమ్ ఛేంజర్. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రధాని మోదీ ప్రమోట్ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. 'హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. 11 రోజుల పాటు విశాఖలోనే ఉండి సహాయక చర్యలు చేపట్టాను. హుద్హుద్ సమయంలో మా కృషిని విశాఖ ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారని చంద్రబాబు తెలిపారు.