NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Modi-Putin: ఉగ్రవాదంపై పోరాటం భారత్‌కు రష్యా మరోసారి మద్దతు.. మోదీకి కాల్‌ చేసిన పుతిన్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Modi-Putin: ఉగ్రవాదంపై పోరాటం భారత్‌కు రష్యా మరోసారి మద్దతు.. మోదీకి కాల్‌ చేసిన పుతిన్
    ఉగ్రవాదంపై పోరాటం భారత్‌కు రష్యా మరోసారి మద్దతు.. మోదీకి కాల్‌ చేసిన పుతిన్

    Modi-Putin: ఉగ్రవాదంపై పోరాటం భారత్‌కు రష్యా మరోసారి మద్దతు.. మోదీకి కాల్‌ చేసిన పుతిన్

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 05, 2025
    03:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌ ఉగ్రవాదంపై సాగిస్తున్న పోరాటానికి రష్యా మరోసారి మద్దతు ప్రకటించింది.

    ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.

    జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

    ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో వెల్లడించారు.

    "పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి మోదీతో ఫోన్ ద్వారా మాట్లాడారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై సాగుతున్న భారత పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు," అని జైస్వాల్ చెప్పారు.

    వివరాలు 

     విక్టరీ డే సందర్భంగా  పుతిన్‌కు,నరేంద్ర మోదీ శుభాకాంక్షలు 

    ఈ దాడికి పాల్పడిన వారు, వారిని సహకరించినవారికి కఠినమైన శిక్షలు విధించాల్సిన అవసరముందని పుతిన్ అభిప్రాయపడ్డారని, రష్యా-భారత్ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని కూడా ఆయన పేర్కొన్నట్లు జైస్వాల్ వివరించారు.

    ఈ సందర్భాన్ని ఉపయోగించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విక్టరీ డే (విజయ దినోత్సవం) సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

    ఇటీవలి పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.

    దాడి అనంతరం మొదట్లోనే ఈ దారుణ ఘటనను పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఈ విషాద సమయంలో భారత్‌కు సంపూర్ణ మద్దతుగా ఉండబోతున్నామని ప్రకటించారు.

    వివరాలు 

    దాడికి బాధ్యులైనవారికి తప్పకుండా శిక్షలు

    ఈ మేరకు రష్యా అధ్యక్షుడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక సంతాప సందేశాలు పంపారు.

    ఉగ్రవాద దాడులను సహించబోమని, ఈ దాడికి బాధ్యులైనవారికి తప్పకుండా శిక్షలు ఖాయం కావాలని ఆశిస్తున్నామని చెప్పారు.

    ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్‌తో సహకారాన్ని మరింతగా పెంచుకునేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

    ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పుతిన్, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్లాదిమిర్ పుతిన్

    తాజా

    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్
    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం

    వ్లాదిమిర్ పుతిన్

    Russia : ప్రధాని రాక తమకు సంతోషమన్న రష్యా..మోదీ దూతగా పుతిన్'తో జైశంకర్ భేటీ భారతదేశం
    Putin's Secret Residence: ఫిన్లాండ్ సమీపంలో పుతిన్ రహస్య నివాసం గుర్తింపు  రష్యా
    Elon Musk: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేస్తారు: మస్క్ సంచలన కామెంట్స్  ఎలాన్ మస్క్
    Joe Biden: నావల్నీ మృతికి పుతిన్ బాధ్యత వహించాలి: బైడెన్ అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025