NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో సమ్మెకు దిగిన వాలంటీర్లు 
    తదుపరి వార్తా కథనం
    AP Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో సమ్మెకు దిగిన వాలంటీర్లు 
    AP Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో సమ్మెకు దిగిన వాలంటీర్లు

    AP Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో సమ్మెకు దిగిన వాలంటీర్లు 

    వ్రాసిన వారు Stalin
    Dec 26, 2023
    11:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు సమ్మె సైరన్ మోగించారు. ఇన్నాళ్లు జగన్ ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచిన వాలంటీర్లు ఇప్పుడు.. సమ్మెకు దిగడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

    వేతనం పెంపుదల, సర్వీసులు క్రమబద్ధీకరించడం లేదని వాలంటీర్లు మంగళవారం నుంచి కొన్ని జిల్లాల్లో సమ్మెకు దిగారు.

    సమ్మెలో భాగంగా ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమానికి వాలంటీర్లు దూరంగా ఉన్నారు.

    అయితే కొన్ని జిల్లాల్లో మాత్రమే సమ్మె ప్రభావం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో వైసీపీ నాయకులు ఒత్తిడి మేరకు వాలంటీర్లు సమ్మెలో పాల్గొనడం లేదని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న వారు చెబుతున్నారు.

    2019ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. వీరికి నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఇస్తోంది.

    ఏపీ

    పారిశుద్ధ్య కార్మికులు కూడా.. 

    ఆంధ్రప్రదేశ్‌లో పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌ ఒప్పంద సిబ్బంది కూడా మంగళవారం నుంచే నిరవధిక సమ్మెకు దిగడం గమనార్హం.

    గత ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు.

    ఏపీ వ్యాప్తంగా 50వేల మంది సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. మంగళవారం పలు చోట్ల రోడ్డెక్కి నిరసన తెలిపారు.

    పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, రూ. 26వేలకు వేతనం పెంచాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

    జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. పారిశుద్ధ్య కార్మికుల కోసం చేసిందేమీ లేదన్నారు.

    పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటంతో పని భారం పెరుగుతోందన్నారు. కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    సమ్మె
    తాజా వార్తలు

    తాజా

    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్

    ఆంధ్రప్రదేశ్

    Kachidi Fish : కచిడి చేప ఖరీదు ఎంతో తెలుసా.. దీని బదులు ఒక మారుతి కారు కొనొచ్చు  చేప
    Gas Cylinder Leak: విశాఖలో గ్యాస్ లీక్ ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత  విశాఖపట్టణం
    Kodi Kathi Case: కోడి కత్తి కేసులో కుట్రకోణం లేదు: హైకోర్టులో ఎన్ఐఏ  హైకోర్టు
    AP High Court: 'వై ఏపీ నీడ్స్ జగన్' వివాదం.. సజ్జల, సీఎస్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు  హైకోర్టు

    సమ్మె

    బైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా బెంగళూరులో రోడ్లపై 2 లక్షలకు పైగా నిలిచిపోయిన ఆటోలు బెంగళూరు

    తాజా వార్తలు

    Christmas Tree Decoration: ఈ చిట్కాలతో క్రిస్మస్ చెట్టును ఈజీగా, చౌకగా అలంకరించుకోండి  క్రిస్మస్
    Kisan Diwas 2023: నేడు రైతు దినోత్సవం.. ఏ ప్రధాని జయంతి రోజున జరుపుకుంటారు? భారతదేశం
    Poonch attack: జమ్ముకశ్మీర్‌‌లో ఉగ్రవాదుల వేట.. మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్  జమ్ముకశ్మీర్
    COVID Cases in India: భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 752 మందికి వైరస్  కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025