NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Waqf Bill: వక్ఫ్‌ సవరణ బిల్లుపై కిరణ్‌ రిజిజు కీలక వ్యాఖ్యలు.. జేపీసీకి బిల్లుపై 96 లక్షల విజ్ఞప్తులు
    తదుపరి వార్తా కథనం
    Waqf Bill: వక్ఫ్‌ సవరణ బిల్లుపై కిరణ్‌ రిజిజు కీలక వ్యాఖ్యలు.. జేపీసీకి బిల్లుపై 96 లక్షల విజ్ఞప్తులు
    వక్ఫ్‌ సవరణ బిల్లుపై కిరణ్‌ రిజిజు కీలక వ్యాఖ్యలు

    Waqf Bill: వక్ఫ్‌ సవరణ బిల్లుపై కిరణ్‌ రిజిజు కీలక వ్యాఖ్యలు.. జేపీసీకి బిల్లుపై 96 లక్షల విజ్ఞప్తులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 02, 2025
    01:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం ప్రసంగించారు.

    ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాతనే దీన్ని తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు.

    ఈ బిల్లును ప్రవేశపెట్టకపోతే,పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్‌ ఆస్తిగా ప్రకటించే పరిస్థితి వచ్చివచ్చిందని ఆయన అన్నారు.

    ''ఈ బిల్లుకు సంబంధించిన విషయంలో విపక్షాలు అసత్య ప్రచారం చేశాయి.ఇందులోని అంశాలను అపార్థం చేసుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.

    1954లో వక్ఫ్‌ చట్టం మొదటిసారిగా అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో అది అప్రజాస్వామికమని ఎవరూ చెప్పలేదు,''అని రిజిజు విపక్షాలను విమర్శించారు.

    జేపీసీకి ఈ బిల్లుపై 96 లక్షల విజ్ఞప్తులు అందాయి అని వివరించారు.

    వివరాలు 

    యూపీఏ హయాంలో ఢిల్లీలోని కీలక స్థలాలు వక్ఫ్ సొంతం 

    ఈ సవరణ బిల్లుతో ముస్లిం సమాజానికి ఎలాంటి నష్టం కలగదని స్పష్టం చేశారు.

    వక్ఫ్ చట్ట సవరణలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

    యూపీఏ హయాంలో ఉంటే ఢిల్లీలోని కీలక స్థలాలు వక్ఫ్ సొంతమయ్యేవని ఆరోపించారు.

    కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విలువైన ప్రభుత్వ భూములను వక్ఫ్‌కు అప్పగించారని మండిపడ్డారు.

    ఇక మసీదుల నిర్వహణపై ఈ చట్టం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.

    బిల్లుకు ఆమోదం కోసం అవసరమైన సంఖ్యాబలం 272 కాగా, ఎన్డీఏ వద్ద 298 మంది సభ్యులు ఉన్నారు. విపక్ష పార్టీల బలం 233 కాగా, ఇతర సభ్యులు 11 మంది ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కిరెణ్ రిజిజు

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    కిరెణ్ రిజిజు

    సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలి: కిరెన్ రిజిజు సుప్రీంకోర్టు
    కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: జస్టిస్ నారిమన్ సుప్రీంకోర్టు
    'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ డివై చంద్రచూడ్
    కేంద్ర న్యాయ మంత్రిగా కిరెణ్ రిజిజు తొలగింపు; అర్జున్ రామ్ మేఘవాల్ నియామకం  అర్జున్ రామ్ మేఘవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025