Page Loader
PM Modi: 'యుద్ధాన్ని ఆపాలి'.. ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్‌కాల్‌
'యుద్ధాన్ని ఆపాలి'.. ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్‌కాల్‌

PM Modi: 'యుద్ధాన్ని ఆపాలి'.. ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్‌కాల్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2025
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్రతరమైంది. ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకు అమెరికా (USA) ఇరాన్‌ అణు స్థావరాలపై దాడులు జరపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు లోనైంది. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ షెజెష్కియాన్‌తో ఫోన్‌ ద్వారా చర్చించారు. పశ్చిమాసియాలోని యుద్ధ పరిణామాలపై మోదీ లోతైన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, శత్రుత్వాన్ని తగ్గించుకోవాలని ఆయన కోరారు. సమస్యలను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

Details

అణుస్థావరాలపై అమెరికా దాడులు

ఇంతకుముందే ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో సహకారంపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన ట్రంప్‌, ఆపై రెండు రోజుల్లోనే ఇరాన్‌లోని మూడు ముఖ్య అణుస్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించారు. దీనిపై స్పందించిన ఇరాన్‌, అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించడంతో పాటు ఇజ్రాయెల్‌పై కూడా దాడులను కొనసాగించింది. తదుపరి ఈ హెచ్చరికలపై స్పందించిన ట్రంప్‌ కూడా "ఇరాన్‌ ప్రతీకార చర్యలకు పాల్పడితే, ఇంతకుముందెన్నడూ చూడని రీతిలో అమెరికా దాడులకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య భారత్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతియుత పరిష్కారాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, ఉద్రిక్తతలను తగ్గించడం ద్వారా మాత్రమే సమస్యను శాశ్వతంగా పరిష్కరించగలమని పునరుద్ఘాటించారు.