S Jaishankar: పాకిస్థాన్ను చెడ్డ పొరుగు దేశంగా అభివర్ణించిన జైశంకర్
ఈ వార్తాకథనం ఏంటి
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పాకిస్థాన్ను "చెడ్డ పొరుగు దేశం"గా పేర్కొన్నారు. ఉగ్రవాదం నుంచి తమ ప్రజలను కాపాడుకునే హక్కు భారతదేశానికి ఉందని, ఆ హక్కును అవసరమైతే సక్రమంగా ఉపయోగిస్తామని ఆయన స్పష్టంగా తెలిపారు. శుక్రవారం ఐఐటీ మద్రాస్ విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది పహల్గామ్లో లష్కరే తోయిబా తో పనిచేసే ఉగ్రవాద సంస్థ "ది రెసిస్టెన్స్ ఫ్రంట్" దాడి చేసిన తరువాత, భారత్ "ఆపరేషన్ సిందూర్"ను చేపట్టిన విషయాన్ని జైశంకర్ పరోక్షంగా గుర్తుచేశారు.
వివరాలు
ఉగ్రవాదం, నీటి పంపకాలు కలిసి నడవవని స్పష్టీకరణ
"మేము మా హక్కును ఎలా ఉపయోగించాలో మాకు తెలుసు. ఏం చేయాలో, ఏం చేయకూడదో ఎవరూ మాకు చెప్పలేరు. మేము మా ప్రజలను రక్షించేందుకు కావాల్సిన చర్యలు చేస్తాం" అని ఆయన అన్నారు. పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా, పశ్చాత్తాపం లేకుండా ఉగ్రవాదాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. సింధు జలాల ఒప్పందాన్ని కూడా జైశంకర్ ప్రస్తావించారు. "నిర్దిష్ట సమయానికి నీటి పంపకానికి అంగీకరించాం. కానీ, పాకిస్థాన్ను ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యలు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయంటే, మంచి పొరుగు దేశ సంబంధాల ప్రయోజనాలు రావడం అసాధ్యం. నీరు పంచుకో, కానీ నేను నీపై ఉగ్రవాదాన్ని కొనసాగిస్తాను అంటే కుదరదు"అని ఆయన స్పష్టం చేశారు. పహల్గామ్ దాడికి తర్వాత ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే.
వివరాలు
పాక్ ఆర్మీ చీఫ్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు
భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాన కారణం పాకిస్థాన్ సైన్యం అని జైశంకర్ గత నెలలో వ్యాఖ్యానించారు. మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉన్నట్టే.. మంచి సైనిక నాయకులు, అంత మంచివారు కానివారు కూడా ఉంటారని, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించిన విషయం విదితమే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మా పొరుగు దేశం కయ్యాలమారి: జైశంకర్
#WATCH | Tamil Nadu: On being asked about India's neighbourhood policy, EAM Dr S Jaishankar says, "... You can also have bad neighbours. Unfortunately, we do. When you have bad neighbours, if you look to the one to the west. If a country decides that it will deliberately,… pic.twitter.com/8w6dgDHLtc
— ANI (@ANI) January 2, 2026