
Chandrababu: 2027లో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం : సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దెబ్బతిందని, కేంద్ర పథకాల్ని పక్కదారి పట్టించి రాష్ట్రాభివృద్ధికి అవరోధం కలిగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ సమన్వయంతో ముందుకు సాగుతుందని వెల్లడించారు.
Details
విధ్వంసం నుంచి వికాసం దిశగా
రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిలదొక్కుకునేలా చేసింది. కానీ, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైంది. ప్రజలే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. మనం ఇచ్చిన హామీల మేరకు సుపరిపాలన ప్రారంభించాం. ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించడం మా బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Details
సంస్కరణల పాలనతోనే సంక్షేమం సాధ్యం
ఆర్థిక సంస్కరణలతో పరిపాలన సాగించిన పార్టీ మనదే. సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చాం. ఎన్నికల్లో సామరస్యంతో అందరికీ సమాన న్యాయం చేశాం. పాలనలో పారదర్శకత, సమర్థత తీసుకురావడమే లక్ష్యం. భవిష్యత్తుపై ప్రజలతో స్పష్టంగా మాట్లాడాలని ఆయన సూచించారు. కేంద్ర సహకారంతో ప్రాజెక్టుల పురోగతి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి విశేష సహకారం అందుతోందని ఆయన తెలిపారు. అమరావతి అభివృద్ధికి రూ. 15,000 కోట్లు మంజూరు పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,500 కోట్లు స్టీల్ప్లాంట్కు రూ. 11,400 కోట్లు క్రిష్ సిటీ అభివృద్ధి ప్రారంభం
Details
వాట్సప్ గవర్నెన్స్ - 703 సేవలు ఆన్లైన్కి
అవినీతిని తగ్గించడమే లక్ష్యంగా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఇప్పటికే 500 ప్రభుత్వ సేవలను డిజిటల్గా అందిస్తున్నాం. ఆగస్టు 15 నాటికి ఈ సంఖ్య 703కు చేరుకుంటుంది. ఇది పాలనలో ప్రజలకు మేలు చేస్తుంది, ఇబ్బందులు లేకుండా సేవలు అందుతాయని చంద్రబాబు వివరించారు. రైతుల కోసం గిట్టుబాటు ధర, పెంచిన పింఛన్లు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పంటలకు గిట్టుబాటు ధర, పెంచిన పింఛన్లు, పారిశ్రామిక వృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సేవ, వ్యవసాయ, పరిశ్రమల రంగాలకు సమబలం ఇచ్చేలా పాలన సాగుతుందని తెలిపారు.