NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాం: చంద్రబాబు 
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాం: చంద్రబాబు 
    వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాం

    CM Chandrababu: వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాం: చంద్రబాబు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    08:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద వల్ల కలిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఈ రోజు సాయంత్రానికి పంపించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

    బుడమేరు నది గండిని పూడ్చివేయడంలో సైన్యం సహాయం తీసుకుంటున్నట్లు చెప్పారు.

    ఇళ్లు శుభ్రం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలను తెప్పిస్తున్నామని, అలాగే, ఆన్‌లైన్ ద్వారా ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్‌ల సేవలను నియమిత ధరలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వివరించారు.

    నేటి నుండి నిత్యావసర సరుకులతో పాటు, ప్రతి కుటుంబానికి మూడు ప్యాకెట్ల నూడుల్స్, యాపిల్స్, పాలు పంపిణీ చేయబడుతున్నాయని పేర్కొన్నారు.

    అలాగే, వరద ప్రభావిత ప్రాంతాల్లో సెప్టెంబరు నెల విద్యుత్తు బిల్లుల వసూలును వాయిదా వేస్తున్నామని కూడా తెలిపారు.

    వివరాలు 

    80,000 మందికి నిత్యావసరాల కిట్‌

    ముంపు ప్రభావిత ప్రాంతాల్లో వివిధ సేవలకు ఒకే ధరను నిర్ణయించి, ఇష్టానుసార వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

    మూడు రోజుల్లో అన్ని కుటుంబాలకు నిత్యావసరాల సరఫరా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

    ఈ రోజు 80,000 మందికి నిత్యావసరాల కిట్‌ను అందించడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. రాయితీపై కూరగాయలు పంపిణీ కొనసాగుతుందని కూడా వివరించారు.

    ఇక, బుడమేరు నది పూడ్చివేతలో ఇప్పటివరకు రెండు గండ్లు పూడ్చామని, మూడో గండిని పూడ్చే పనులు కొనసాగుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్‌ 2లో అగ్నిప్రమాదం  వైజాగ్
    CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ  చంద్రబాబు నాయుడు
    Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    Kavitha: 'భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు'.. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్‌కు కవిత లేఖ!  కల్వకుంట్ల కవిత

    చంద్రబాబు నాయుడు

    CM Chandrababu :నేడు పోలవరం పర్యటనకు చంద్రబాబు.. ప్రాజెక్టు పరిశీలన, సమీక్ష  పోలవరం
    Chandrababu Naidu :చంద్రబాబు భావోద్వేగం ..మళ్లీ జన్మ ఉంటే.. కుప్పంలో పుడతా భారతదేశం
    Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు  ఆంధ్రప్రదేశ్
    Chandrababu Naidu: ఏపీలో పింఛనుదారులకు శుభవార్త ..3నుండి 4వేలు పెంపు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025