NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: బలహీనమైన వాయుగుండం.. తీర ప్రాంతాలకు ఉపశమనం
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: బలహీనమైన వాయుగుండం.. తీర ప్రాంతాలకు ఉపశమనం
    బలహీనమైన వాయుగుండం.. తీర ప్రాంతాలకు ఉపశమనం

    Andhra Pradesh: బలహీనమైన వాయుగుండం.. తీర ప్రాంతాలకు ఉపశమనం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 22, 2024
    08:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

    భూభాగం నుంచి వీస్తున్న పొడిగాలుల వల్ల ఈ పరిణామం చోటు చేసుకుందని తెలిపింది. ఈ మార్పుతో రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పింది.

    అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

    రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

    సముద్రం అలజడిగా ఉండటంతో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

    Details

    మత్య్సకారులు వేటకు వెళ్లద్దు

    వాయుగుండం ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.

    శనివారం శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలకు 4 నుంచి 6 డిగ్రీల వరకు తగ్గాయి.

    మంగళవారం నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ప్రజలను వాతావరణ శాఖ సూచించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగాళాఖాతం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    బంగాళాఖాతం

    రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్  ఐఎండీ
    బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    బంగాళాఖాతంలో వాయుగుండం.. ఒడిశా వ్యాప్తంగా దంచికొట్టనున్న వర్షాలు భారీ వర్షాలు
    AP Rains : బంగాళాఖాతంలో తుఫాన్.. ఇక ఏపీలో వానలే వానలు! ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    New tourism policy: కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం భారతదేశం
    Ap Government: ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్‌లు.. ఈసారి ముందుగానే! భారతదేశం
    Nagababu: నాగబాబుకు కూటమి ప్రభుత్వంలో కీలక పదవి భారతదేశం
    Andhrapradesh: వాట్సప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం.. వాట్సప్‌ ద్వారా పౌరసేవలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025