NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు కుమారుడిని అమ్ముకున్న తల్లిదండ్రులు
    తదుపరి వార్తా కథనం
    స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు కుమారుడిని అమ్ముకున్న తల్లిదండ్రులు
    ఐఫోన్ కొనేందుకు కన్నబిడ్డను అమ్ముకున్న తల్లిదండ్రులు

    స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు కుమారుడిని అమ్ముకున్న తల్లిదండ్రులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 28, 2023
    12:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఆరాటపడ్డ ఆ తల్లిదండ్రులకు అమ్ముకునేందుకు ఏం దొరక్క చివరకు కన్నబిడ్డనే అమ్ముకున్నారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది.

    జయదేవ్, సాథీ దంపతులకు పాపులారిటీ పెంచుకుని, సెలబ్రిటీ కావాలన్న కోరిక బలంగా కలిగింది. దీంతో సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ చేయడం మొదలుపెట్టారు.

    అయితే సాధారణ స్మార్ట్ ఫోన్ కాకుండా మరింత నాణ్యతగా, కోరుకున్న రీతిలో వీడియోలు రికార్డు చేసేందుకు ఐఫోన్ కొనాలని నిర్ణయించుకున్నారు.

    ఇందుకు వారికి ఆర్థిక స్తోమత అడ్డొచ్చింది. దీంతో ఏం చేయాలో పాలుపోక కన్నబిడ్డను అమ్మేయాలని భార్యాభర్తలిద్దరూ తీర్మానించుకున్నారు.

    ఉత్తర 24 పరగణాల జిల్లా పానిహతిలోని గాంధీనగర్‌కు చెందిన జయదేవ్, సాథీ దంపతులకు 7 ఏళ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు ఉన్నారు.

    details

    భార్యభర్తల జవాబుతో కంగుతిన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు

    ఇటీవలే ఈ భార్యభర్తలు పలు ప్రాంతాలను సందర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సరికొత్త ఆధునిక ఫోన్ కోసం ఏడాది కూడా నిండని కుమారుడ్ని విక్రయించేశారు.

    మరోవైపు తల్లిదండ్రుల పక్కనే ఉండాల్సిన పసికందు జాడ కనిపించలేదు. దీంతో బిడ్డపై స్థానికులు ఆరా తీశారు.

    డబ్బుల కోసం బిడ్డను తామే అమ్మేశామని బదులిచ్చారు. సదరు డబ్బుతో ఐఫోన్ కొనుగోలు చేసి ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో కంగుతిన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

    దీంతో ఈ జంటను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్
    సోషల్ మీడియా

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి భారతదేశం
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ కోవిడ్

    సోషల్ మీడియా

    డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు మార్క్ జూకర్ బర్గ్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ భారతదేశం
    Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'  ట్విట్టర్
    'బ్లూ టిక్‌'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్  ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025