NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్
    భారతదేశం

    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్

    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 21, 2023, 10:32 am 1 నిమి చదవండి
    డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్
    రెజ్లర్లతో క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ జరిపిన చర్చలు సఫలం

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి వరకు రెజ్లర్లతో అనురాగ్ ఠాకూర్ చర్చలు జరిపారు. దాదాపు ఏడు గంటలపాటు ఈ చర్చలు జరిగాయి. అనంతరం అనురాగ్ ఠాకూర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రిజ్ భూషణ్ శరణ్ పై రెజ్లర్లు తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు ఆయన చెప్పారు. బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవి నుంచి అతను తప్పుకుంటానని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ విచారణ నాలుగు వారాల పాటు ఉంటుందని చెప్పారు.

    నిజానిజాలను తేల్చేందుకు కమిటీ ఏర్పాటు: అనురాగ్ ఠాకూర్

    డబ్ల్యూఎఫ్‌ఐ పాలక వర్గంపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను తేల్చేందుకు కేంద్ర క్రీడాశాఖ ఆధ్వర్యంలో 'పర్యవేక్షక కమిటీ'ని వేస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. విచారణ అనంతరం తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కమిటీ నాలుగు వారాల్లో తమ నివేదికను అందజేస్తుందన్నారు. అప్పటి వరకు బ్రిజ్ భూషణ్‌ రోజువారీ బాధ్యతల నుంచి తప్పుకుంటారన్నారు. ఇదిలా ఉంటే, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐఓఏ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా మాట్లాడుతూ.. న్యాయమైన విచారణ జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    అనురాగ్ సింగ్ ఠాకూర్

    తాజా

    అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు? కర్ణాటక
    అంతర్జాతీయ క్రికెట్‌కు మాజీ కెప్టెన్ గుడ్‌బై క్రికెట్
    రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టగానే మేమ్ ఫేమస్ అంటున్న ఛాయ్ బిస్కట్ తెలుగు సినిమా
    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా ప్రపంచం

    అనురాగ్ సింగ్ ఠాకూర్

    అనురాగ్ ఠాకూర్‌తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్ రెజ్లింగ్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023