NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / VK Saxena: చెట్ల నరికివేతకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలనే విషయం.. నాకు తెలీదు: సుప్రీంకోర్టుకు ఎల్జీ సమాధానం
    తదుపరి వార్తా కథనం
    VK Saxena: చెట్ల నరికివేతకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలనే విషయం.. నాకు తెలీదు: సుప్రీంకోర్టుకు ఎల్జీ సమాధానం
    చెట్ల నరికివేతకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలనే విషయం.. నాకు తెలీదు: సుప్రీంకోర్టుకు ఎల్జీ సమాధానం

    VK Saxena: చెట్ల నరికివేతకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలనే విషయం.. నాకు తెలీదు: సుప్రీంకోర్టుకు ఎల్జీ సమాధానం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 23, 2024
    01:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ రాజధానిలో చెట్ల నరికివేతకు న్యాయస్థానం అనుమతి అవసరమనే విషయం తనకు తెలియదని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

    ఆయన సమర్పించిన ప్రమాణపత్రంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.వీకే సక్సెనా, దిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) ఛైర్మన్ హోదాలో ఉన్నారు.

    రిడ్జ్ ప్రాంతంలో దాదాపు 600 చెట్లను నరికివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

    ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, అక్రమంగా చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలని, అఫిడవిట్ ద్వారా వివరణ ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఆదేశించింది.

    దీనికి అనుగుణంగా ఆయన అఫిడవిట్ సమర్పించారు.

    వివరాలు 

    మెడికల్ ఫెసిలిటీ నిర్మాణానికి  రిడ్జ్ ప్రాంతం 

    సక్సెనా తన ప్రమాణపత్రంలో ఫిబ్రవరి 3వ తేదీన రిడ్జ్ ప్రాంతాన్ని సందర్శించానని, ఆ ప్రాంతంలో మెడికల్ ఫెసిలిటీ నిర్మాణానికి కేటాయించిన ప్రదేశాన్ని మాత్రమే పరిశీలించానని వివరించారు.

    అప్పట్లో, చెట్ల నరికివేతకు కోర్టు అనుమతి అవసరమనే విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదని చెప్పారు.

    మార్చి 21న డీడీఏ ద్వారా చెట్ల నరికివేతకు అనుమతి కోసం దరఖాస్తు చేయబడిన తర్వాతే తనకు ఈ విషయం తెలిసిందని సక్సెనా తెలిపారు.

    డీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, కొన్ని ఇతర అధికారులు చెట్ల నరికివేతకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ విషయంపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    దిల్లీ

    తాజా

    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు
    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా

    సుప్రీంకోర్టు

    Supreme Court: సుప్రీంకోర్టు రికార్డు.. 83,000కి చేరుకున్న పెండింగ్‌ కేసుల సంఖ్య భారతదేశం
    Supreme Court: 'నిందితుడని ఇళ్లను ఎలా కూల్చివేస్తారు'... బుల్‌డోజర్‌ చర్యపై సుప్రీంకోర్టు ఆగ్రహం  భారతదేశం
    Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్  అరవింద్ కేజ్రీవాల్
    #Newsbytesexplainer:'టూ-ఫింగర్-టెస్ట్'అంటే ఏమిటి? సుప్రీం కోర్టు నిషేధం ఉన్నప్పటికీ,ఈ రేప్ కేసులలోఇంకా ఇలానే ఎందుకు దర్యాప్తు జరుగుతోంది  భారతదేశం

    దిల్లీ

    Delhi: DPCC సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. 2.39 కోట్ల నగదు స్వాధీనం  సీబీఐ
    Ram Mohan Naidu: ఆసియా-పసిఫిక్‌ ఛైర్మన్‌గా రామ్మోహన్‌నాయుడు ఏకగ్రీవ ఎన్నిక ఇండియా
    Road Accident : 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఢిల్లీలో 1,571 మంది మృతి.. ఎక్కువ ప్రమాదాలు రాత్రిపూట సంభవించినవే.. రోడ్డు ప్రమాదం
    Sitaram Yechuri: సీతారాం ఏచూరి కన్నుమూత ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025