NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / #NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్'లో పీ-4 విధానం.. పీ-4 అంటే ఏంటి? ఉపయోగాలేంటి? దీని వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి ?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    #NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్'లో పీ-4 విధానం.. పీ-4 అంటే ఏంటి? ఉపయోగాలేంటి? దీని వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి ?
    పీ-4 విధానం.. పీ-4 అంటే ఏంటి? ఉపయోగాలేంటి? దీని వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి ?

    #NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్'లో పీ-4 విధానం.. పీ-4 అంటే ఏంటి? ఉపయోగాలేంటి? దీని వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి ?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 01, 2025
    03:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పీ-4 (People for People - Progressive Poverty Alleviation Program) అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామూహిక సాధికారత కార్యక్రమం.

    ఈ పథక ప్రధాన లక్ష్యం "సంపన్న కుటుంబాలు, పేద కుటుంబాలకు సహాయం చేయడం" ద్వారా రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించడం.

    ఇది ఒక సామాజిక సహాయ మోడల్, ఇందులో ప్రభుత్వం కేవలం "సహాయక సంధానకర్త" (Facilitator)గా మాత్రమే పనిచేస్తుంది.

    వివరాలు 

    పీ-4 లక్ష్యాలు: 

    ఆర్థిక అసమానత తగ్గింపు: సంపన్నులు పేదలకు సహాయం చేయడం ద్వారా సమాజంలో ఆర్థిక సమతుల్యత సాధించటం.

    సామూహిక భాగస్వామ్యం: ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజలు కలిసి పేదరిక నిర్మూలనకు కృషి చేయడం.

    పేద కుటుంబాల గుర్తింపు: గ్రామసభలు, సర్వేలు, డేటా ఆధారంగా అసలైన లబ్ధిదారులను గుర్తించడం.

    2047 నాటికి ఆదాయంలో అగ్రస్థానం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన ప్రకారం, 2047 నాటికి భారతీయులు (ప్రత్యేకంగా 30% తెలుగు ప్రజలు) ఆదాయ పరంగా ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకోవాలనే లక్ష్యం.

    వివరాలు 

    పీ-4 ఎలా పనిచేస్తుంది? 

    లబ్ధిదారుల ఎంపిక: గ్రామ,వార్డు సచివాలయాల డేటా,సర్వేలు,గ్రామసభల ద్వారా నిజమైన పేద కుటుంబాలను గుర్తిస్తారు.

    40లక్షల కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కావచ్చు.

    సంపన్న కుటుంబాలతో అనుసంధానం: ప్రతి 10% సంపన్న కుటుంబాలు,20% పేద కుటుంబాలకు సహాయం అందించాలి.

    ఉదాహరణకు,ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటే,10 సంపన్న కుటుంబాలు 20 పేద కుటుంబాలను "దత్తత తీసుకుని"ఆర్థిక, సామాజిక సహాయం అందించాలి.

    సమృద్ధి బంధనం డిజిటల్ ప్లాట్‌ఫారమ్: లబ్ధిదారులు,సహాయక కుటుంబాల వివరాలు "సమృద్ధి బంధనం"డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు అవుతాయి.

    ఇది పారదర్శకత, ట్రాకింగ్‌కు ఉపయోగపడుతుంది.

    స్వచ్ఛంద సహాయం: ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్తిగా స్వచ్ఛందం.

    ప్రభుత్వం నేరుగా డబ్బును అందించదు, కానీ సంపన్నులు పేదలకు ఆర్థిక, ఉపాధి, విద్య, వైద్య సహాయం అందించడానికి ప్రోత్సహిస్తుంది.

    వివరాలు 

    పీ-4 ప్రయోజనాలు: 

    పేదలకు నేరుగా సహాయం అందించడం.

    సమాజంలో ఆర్థిక సమతుల్యతను సాధించడం.

    ప్రభుత్వ డబ్బుపై ఆధారపడకుండా సామాజిక బాధ్యతను పెంపొందించడం.

    2047 నాటికి తెలుగు ప్రజలను ప్రపంచ ఆదాయ శ్రేణిలో ముందుకు తీసుకెళ్లడం.

    వివరాలు 

    ఆగస్టు 2024 నాటికి 5 లక్షల కుటుంబాలే లక్ష్యం 

    పీ-4 ఒక సామూహిక సహాయ విధానం,ఇందులో ప్రభుత్వం కేవలం సమన్వయకర్తగా పని చేస్తుంది.

    సంపన్నులు పేదలను దత్తత తీసుకుని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ పథక ముఖ్య ఉద్దేశం.

    ఆగస్టు 2024 నాటికి 5 లక్షల కుటుంబాలను ఈ పథకంలో భాగం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025