NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు?
    తదుపరి వార్తా కథనం
    రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు?
    రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు?

    రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు?

    వ్రాసిన వారు Stalin
    Apr 10, 2023
    10:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎప్పుడూ అదానీ అంశంపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నించే అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కాంగ్రెస్‌ను వీడిన నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే రాహుల్ చేసిన ఆ ట్వీట్‌కు తీవ్ర స్థాయిలో ప్రతి స్పందన వ్యక్తమవుతోంది.

    ముఖ్యంగా కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ రాహుల్‌పై బలమైన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి 'అవాంఛనీయ వ్యాపారవేత్తలను' కలుస్తున్నారని అన్నారు.

    గులాం నబీ ఆజాద్ చేసిన ఆరోణలపై బీజేపీ స్పందించింది. రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆ వ్యాపారులు ఎవరు? అని బీజేపీ ప్రశ్నిస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అజాద్, కిరణ్ కుమార్ రెడ్డి, సిసోడియాను ప్రశ్నిస్తూ రాహుల్ ట్వీట్

    सच्चाई छुपाते हैं, इसलिए रोज़ भटकाते हैं!

    सवाल वही है - अडानी की कंपनियों में ₹20,000 करोड़ बेनामी पैसे किसके हैं? pic.twitter.com/AiL1iYPjcx

    — Rahul Gandhi (@RahulGandhi) April 8, 2023

    రాహుల్ గాంధీ

    అదానీ కంపెనీల్లో రూ. 20,000 కోట్ల బినామీ డబ్బు ఎవరిది?: రాహుల్

    ఇటీవలి సంవత్సరాల్లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన కొంతమంది నాయకులను ప్రశ్నిస్తున్నట్లుగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

    వాళ్లు వాళ్ళు నిజాన్ని దాచిపెడతారని, అందుకే రోజూ తప్పుదోవ పట్టిస్తున్నారని, తన ప్రశ్న అలాగే ఉందని రాహుల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అదానీ కంపెనీల్లో రూ. 20,000 కోట్ల బినామీ డబ్బు ఎవరిదని ప్రశ్నించారు.

    తన ట్వీట్‌లో గులాం నబీ ఆజాద్, జ్యోతిరాదిత్య సింధియా, హిమంత బిస్వా శర్మ, కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ ఆంటోనీ పేర్లను జత చేశారు.

    ఆజాద్

    దేశం బయట ఎవరిని కలుస్తాడో నాకు తెలుసు: ఆజాద్

    రాహుల్ ట్వీట్‌లో తన పేరును ప్రస్తావించిన నేపథ్యంలో గులాం నబీ ఆజాద్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటని, తనకు ఏ వ్యాపారితోనూ సంబంధం లేదని చెప్పారు.

    తనకు గాంధీ కుటుంబం అంటే చాలా గౌరవమని, అందుకే వారికి వ్యతరేకంగా ఏమీ మాట్లాడకూడదనుకుంటున్నాని వెల్లడించారు.

    అతను(రాహుల్) దేశం బయట అవాంఛనీయ వ్యాపారవేత్తలను ఎక్కడికి వెళ్లి కలుస్తాడో నేను ఉదాహరణలు చెబుతానని గులాం నబీ ఆజాద్ చెప్పారు.

    ఇటీవల తన 'ఆత్మకథ' పుస్తకం విడుదల సందర్భంగా కాంగ్రెస్, రాహుల్‌పై గులాం నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను 'బ్లూపర్స్ అండ్ బాంబాస్ట్'గా వర్ణించారు రాహుల్ గాంధీ వల్లే తనతో పాటు చాలా మంది నేతలు పార్టీని వీడారని అన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఆజాద్ వీడియోను ట్వీట్ చేసిన బీజేపీ

    …their entire family (the Gandhis) have all along had association with businessmen, including him (Rahul Gandhi). He (Rahul) goes abroad and meets undesirable businessmen…

    - Ghulam Nabi Azad

    Rahul Gandhi must explain who are these businessmen he meets and for what purpose? pic.twitter.com/2juk0GlvhW

    — BJP (@BJP4India) April 9, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    కాంగ్రెస్
    బీజేపీ

    తాజా

    Systematic Investment Plan: తక్కువ జీతం.. పెద్ద సంపద? SIP పెట్టుబడితో సాధ్యమే! జీవనశైలి
    Haryana: హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు హర్యానా
    Supreme Court: మాజీ న్యాయమూర్తులకు సమాన పెన్షన్ ఇవ్వాలి: సుప్రీం ఆదేశాలు  సుప్రీంకోర్టు
    Subodh Kumar Goel: యూకో బ్యాంక్‌ మాజీ సీఎండీ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ను అరెస్టు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    రాహుల్ గాంధీ

    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ అదానీ గ్రూప్
    అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ గౌతమ్ అదానీ
    ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ కాంగ్రెస్
    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    కాంగ్రెస్

    Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    D Srinivas: సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత తెలంగాణ
    కర్ణాటకలో 'PayCM' క్యూఆర్ కోడ్ పోస్టర్ల కలకలం; కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్ కర్ణాటక
    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ అసెంబ్లీ ఎన్నికలు

    బీజేపీ

    దిల్లీ మద్యం కేసు: 'సీబీఐ తర్వాత అరెస్టు చేసేది ఎమ్మెల్సీ కవితనే' కల్వకుంట్ల కవిత
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025