NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhole Baba: హత్రాస్ తొక్కిసలాటలో 116 మందికి పైగా మృతి.. ఘటన తర్వాత భోలే బాబా పరార్..  
    తదుపరి వార్తా కథనం
    Bhole Baba: హత్రాస్ తొక్కిసలాటలో 116 మందికి పైగా మృతి.. ఘటన తర్వాత భోలే బాబా పరార్..  
    హత్రాస్ తొక్కిసలాటలో 116 మందికి పైగా మృతి.. ఘటన తర్వాత భోలే బాబా పరార్..

    Bhole Baba: హత్రాస్ తొక్కిసలాటలో 116 మందికి పైగా మృతి.. ఘటన తర్వాత భోలే బాబా పరార్..  

    వ్రాసిన వారు Stalin
    Jul 03, 2024
    09:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక మతపరమైన సమావేశంలో తొక్కిసలాటలో 116 మందికి పైగా మరణించగా అనేక మంది గాయపడ్డారు.

    సాకార్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా నిర్వహించిన సత్సంగం ముగింపు కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది.

    తొక్కిసలాట ఘటన తర్వాత ఆచూకీ లభించని భోలే బాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    తొక్కిసలాట గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

    ఈ మృతదేహాలను చూసిన రజనీష్ అనే పోలీసు అధికారి గుండె పోటుతో మరణించారు.

    రజనీష్ అత్యవసర సహాయక బృందంలో కీలక సభ్యుడు . కాగా ఈ రోజు ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ ఘటనా స్ధలికి వెళ్లి బాధుతులను ఓదార్చనున్నారు.

    వివరాలు 

    భోలే బాబా ఎవరు ? 

    భోలే బాబా ఎటా జిల్లాలోని పాటియాలీ తహసీల్‌లోని బహదూర్ గ్రామానికి చెందినవాడు. అతను ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) మాజీ ఉద్యోగి అని చెప్పుకున్నాడు.

    మతపరమైన ప్రసంగాలు చేయడం కోసం 26 ఏళ్ల క్రితం తన ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.

    ప్రస్తుతం పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్ ఢిల్లీతో సహా భారతదేశం అంతటా సత్సంగం నిర్వహిస్తుంటాడు. కాగా ఆయనకు లక్షలాదిగా అనుచరులు ఉన్నారు.

    వివరాలు 

    సోషల్ మీడియాకు భోలే బాబా దూరం 

    ముఖ్యంగా, కొందరు హిందూ మత ప్రవక్తల వ్యక్తుల మాదిరిగా కాకుండా, భోలే బాబా సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు.

    ఏ ప్లాట్‌ఫారమ్‌లోనూ అధికారిక ఖాతాలను కలిగి లేరు. అట్టడుగు స్థాయిలో ఆయన ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన అనుచరులు చెప్పుకుంటారు.

    ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ప్రతి మంగళవారం భోలే బాబా కార్యక్రమాలు నిర్వహించటం ఆనవాయితీ. ఈ కార్యక్రమాలకు వేలాది మంది హాజరవుతారు.

    ఈ సమావేశాల సమయంలో, వాలంటీర్లు భక్తులకు ఆహారం , పానీయాలతో సహా అవసరమైన ఏర్పాట్లను చేస్తారు.

    కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలోబోలే బాబా జనాలను ఆకర్షించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక శుభమన్ గిల్
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    Travel India: వేసవిలో స్విట్జర్లాండ్‌ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే! భారతదేశం
    KTR: పార్టీ అధినేతకు సూచనలు ఇవ్వడం కోసం లేఖలు రాయొచ్చు : కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    ఉత్తర్‌ప్రదేశ్

    UttarPradesh: మహోబాలో ఘోర ప్రమాదం.. అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్‌లో ముగ్గురు కార్మికులు మృతి  భారతదేశం
    UP: దుంగార్‌పూర్ కేసులో ఆజం ఖాన్‌కు ఏడేళ్ల శిక్ష.. రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తీర్పు  భారతదేశం
    UP: ఉత్తర్‌ప్రదేశ్‌ లో దారుణం.. టీచర్ ను కాల్చి చంపిన కానిస్టేబుల్  భారతదేశం
    Uttarpradesh: ప్రయాగ్‌రాజ్‌లో దారుణం.. అత్తింటి వారిని హత్య చేసిన కోడలి తరుపు బంధువులు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025