NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా? 
    తదుపరి వార్తా కథనం
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా? 
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?

    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా? 

    వ్రాసిన వారు Stalin
    Apr 25, 2023
    05:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్యాంగ్‌స్టర్‌ ఆనంద్ మోహన్ బిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆనంద్ మోహన్ విడుదల వార్త ఇప్పుడు బిహార్‌లో సంచలనంగా మారింది.

    బిహార్ ప్రభుత్వం ఇటీవల సవరించిన జైలు నిబంధనల కారణంగా ఆనంద్ మోహన్ విడుదలకు మార్గం సుగమం కావడం గమనార్హం.

    నితీష్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న ఆయన విడుదలను సులభతరం చేసేందుకే జైలు నిబంధనలను సవరించిందంటూ ప్రతిపక్షాలు భగ్గమంటున్నాయి.

    ఆనంద్ మోహన్ తన కుమారుడి నిశ్చితార్థం కోసం పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు.

    1994లో 30ఏళ్ల నాటి ఐఏఎస్ గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి.కృష్ణయ్య హత్య కేసులో ఆనంద్ మోహన్ దోషిగా తేలారు. ఈ కేసులో అతను జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

    బిహార్ 

    నితీష్ కుమార్ ప్రభుత్వం సవరించిన నింబధన ఏంటి?

    నితీష్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న ప్రిజన్ మాన్యువల్, 2012ను సవరించింది. ముఖ్యంగా 481నిబంధనను మార్చడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది.

    ప్రభుత్వ అధికారులను చంపినందుకు దోషులుగా ఉన్నవారు సత్ప్రవర్తన కారణంగా విడుదల చేయడానికి అర్హులు కాదని 481 నిబంధనల చెబుతుంది. అయితే ఈ క్లాజ్‌ను ప్రభుత్వం తొలగించింది. దీని ద్వారా శిక్ష కాలం తగ్గుతుంది.

    ఈ నిబంధనను సవరించడం వల్లే ప్రభుత్వ ఐఏఎస్‌ హత్య కేసులో దోషిగా తేలిన డాన్ ఆనంద్ మోహన్‌తో మరికొందరు సత్ప్రవర్తన కింద విడుదలయ్యారు. ప్రతిపక్షాల విమర్శలపై ఆనంద్ మోహన్ స్పందించారు.

    సుదీర్ఘ జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయవచ్చని ఆనంద్ మంగళవారం అన్నారు.

    బిహార్

    నితీశ్ చెప్పిన మూడు నెలల్లోనే ఆనంద్ మోహన్ 

    ఈ ఏడాది జనవరిలో బిహార్ సీఎం నితీష్ కుమార్ తన పార్టీ జేడీయూ ఆధ్వర్యంలో పట్నాలో రాజ్‌పుత్ సదస్సును నిర్వహించారు.

    అయితే ఈ సదస్సులో గ్యాంగ్‌స్టర్ 'ఆనంద్ మోహన్ విడుదల' నినాదాలతో సీఎంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడుతూ, ఆనంద్ మోహన్ గురించి చింతించవద్దని, తన వంతు ప్రయత్నం చేస్తానని నితీశ్ చెప్పడం సంచలనంగా మారింది.

    నితీశ్ అన్న విధంగా మూడు నెలల్లో ఆనంద్ మోహన్ జైలు నుంచి శాశ్వతంగా బయటపడ్డారు.

    బిహార్

    స్వాతంత్య్ర భారతంలో మరణశిక్ష పడిన తొలి రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ 

    1994లో ఆనంద్ మోహన్ నేతృత్వంలోని గ్యాంగ్ దళిత ఐఏఎస్, గోపాల్‌గంజ్ కలెక్టర్ కృష్ణయ్యను హత్య చేసారు. ఆంధ్రప్రదేశ్‌లోని దళిత కుటుంబంలో జన్మించి కలెక్టర్ స్థాయికి ఎదిగిన అమాయక ప్రభుత్వోద్యోగిని నాడు రౌడీ ముకలు కొట్టి చంపాయి.

    ప్రస్తుతం ఆనంద్ ఈ కేసులో శిక్ష అనభవిస్తూనే జైలు నుంచి విడుదలయ్యయారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న బిహార్ డాన్ ఆనంద్ మోహన్ 1996లో జైలులో నుంచే ఎన్నికల్లో పోటీచేసి సియోహర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

    కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన ఆనంద్‌కు 2007లో పాట్నా హైకోర్టు మరణశిక్ష విధించింది. 2008లో శిక్షను జీవిత ఖైదుగా తగ్గించారు. స్వాతంత్య్ర భారతంలో మరణశిక్షను పడిన తొలి భారత రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్

    బిహార్

    కుల సమీకరణాల్లో భాగంగానే ఆనంద్ మోహన్‌ను విడుదల చేశారా?

    వాస్తవానికి మార్చి 2021లో బిహార్ ప్రభుత్వం ఆనంద్ మోహన్ జైలు శిక్షను రద్దు చేసే డిమాండ్‌ను తిరస్కరించింది. ఎందుకంటే అప్పుడు నితీష్‌కి బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు.

    ఇప్పుడు ఆనంద్ మోహన్ కుమారుడు, భార్య నితీష్ సంకీర్ణ భాగస్వామి అయిన ఆర్జేడీలో ఎమ్మెల్యేలుగానే కాకుండా కీలకమైన నేతలుగా ఉన్నారు.

    బిహార్‌లో వరుస ఎన్నికల నేపథ్యంలో నితీష్‌కు మద్దతు ఇచ్చే వర్గాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. బీజేపీ కలిసి ఉన్నప్పుడు నితీష్ హిందుత్వ ముసుగుతో నెట్టుకొచ్చారు.

    ఇప్పుడు బీజేపీకి దూరం కావడంతో మతపరమైన రాజకీయాలు చెల్లవు. అందుకే కుల సమీకరణాలపై ఇప్పుడు నితీష్ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

    కుల సమీకరణాల్లో భాగంగానే ఆనంద్ మోహన్‌ను నితీష్ ప్రభుత్వం విడుదల చేసినట్లు స్పష్టమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్
    నితీష్ కుమార్
    ముఖ్యమంత్రి
    రాష్ట్రీయ జనతా దళ్/ఆర్జేడీ

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ

    నితీష్ కుమార్

    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ బీజేపీ
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ

    ముఖ్యమంత్రి

    విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్ విశాఖపట్టణం
    ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్

    రాష్ట్రీయ జనతా దళ్/ఆర్జేడీ

    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు లాలూ ప్రసాద్ యాదవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025