NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ స్కాంలో రాజ్ కసిరెడ్డి తర్వాత ఎవరు?.. మరో హై-ప్రొఫైల్ పేరు బయటకు!
    తదుపరి వార్తా కథనం
    AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ స్కాంలో రాజ్ కసిరెడ్డి తర్వాత ఎవరు?.. మరో హై-ప్రొఫైల్ పేరు బయటకు!
    ఏపీ లిక్కర్‌ స్కాంలో రాజ్ కసిరెడ్డి తర్వాత ఎవరు?.. మరో హై-ప్రొఫైల్ పేరు బయటకు!

    AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ స్కాంలో రాజ్ కసిరెడ్డి తర్వాత ఎవరు?.. మరో హై-ప్రొఫైల్ పేరు బయటకు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 22, 2025
    04:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా మరో సంచలన మలుపు చోటు చేసుకుంది.

    ఇప్పటికే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, విచారణను మరింత వేగవంతం చేశారు.

    ఈ కేసులో మరో ప్రముఖుడి పేరు వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో వచ్చిన సమాచారం ప్రకారం, 'బియాండ్ కాఫీ' అధినేత బాలం సుధీర్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది.

    సుధీర్‌ పేరును రాజ్‌ కసిరెడ్డి సన్నిహితుడిగా అధికారులు గుర్తించినట్టు సమాచారం. మరింతగా రాజ్ కసిరెడ్డి నుంచి బాలం సుధీర్‌కు రూ.50 కోట్లు చేరినట్టు సిట్ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

    ఈనేపథ్యంలో బాలం సుధీర్‌ను అరెస్ట్ చేసేందుకు సిట్ కార్యాచరణ ప్రారంభించినట్టు సమాచారం.

    Details

    అరెస్టు చేసి విజయవాడకు తరలింపు

    రాజ్‌ కసిరెడ్డిని విచారిస్తున్న సమయంలోనే సుధీర్ పేరు బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. సిట్‌ అధికారులు ప్రస్తుతం విచారణను అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు.

    నిన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారేవరకు రాజ్‌ కసిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించిన సిట్, ఈరోజు ఉదయం 7 గంటల నుంచీ మళ్లీ విచారణ కొనసాగిస్తున్నారు.

    ఈకేసులో రాజ్‌ కసిరెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఆయనను అరెస్ట్ చేసినట్టు సమాచారం.

    విచారణకు హాజరుకావాలని మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించని రాజ్‌ కసిరెడ్డి.. చివరకు రేపు విచారణకు వస్తానని చెప్పిన తర్వాత, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకొని వెంటనే విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ఆంధ్రప్రదేశ్

    Andhra News: వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌.. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన జీఎస్‌డీపీ  భారతదేశం
    Andhra pradesh: ఆంధ్రప్రదేశ్'లో సంక్షేమ పథకాలు అమలుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న ప్రభుత్వం.. భారతదేశం
    AP Rains : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు భారీ వర్షాలు
    Kakani Govardhan Reddy: వైసీపీ నేత కాకాణికి బిగ్ షాక్.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ వైసీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025