NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi:దిల్లీ పీఠం ఎవరిది? మొదలైన కౌంటింగ్‌
    తదుపరి వార్తా కథనం
    Delhi:దిల్లీ పీఠం ఎవరిది? మొదలైన కౌంటింగ్‌
    దిల్లీ పీఠం ఎవరిది? మొదలైన కౌంటింగ్‌

    Delhi:దిల్లీ పీఠం ఎవరిది? మొదలైన కౌంటింగ్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 08, 2025
    08:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

    ఈ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

    మొత్తం 19 కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 10 వేల మంది పోలీసులను మూడంచెల భద్రతతో మోహరించారు. లెక్కింపు ప్రక్రియలో తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు.

    దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ 36 స్థానాలు కావాలి. ఈ నెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60.54% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    Details

    గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన బీజేపీ

    తాజా ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేయగా, ఆప్‌ ఈ అంచనాలను ఖండించింది.

    తమ విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆప్‌ నాయకత్వం ప్రకటించింది. 2013 నుంచి దిల్లీపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది.

    వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో కేజ్రీవాల్‌ పార్టీ ఉంది. మరోవైపు, 26 ఏళ్ల విరామం తర్వాత దిల్లీ పాలనను స్వాధీనం చేసుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది.

    2013 వరకు దిల్లీలో వరుసగా 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ, ఈసారి కూడా అంతగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడంలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    బీజేపీ

    తాజా

    2025 Yezdi Adventure:సరికొత్త 2025 యెజ్డి అడ్వెంచర్ లాంచ్.. ధర ఎంతంటే?  ఆటో మొబైల్
    World Environment Day 2025: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం అనే థీమ్‌తో వేడుకలు ముఖ్యమైన తేదీలు
    11 years of NDA: ఎన్డీయే ప్రభుత్వానికి నిన్నటితో 11 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన మోదీ  నరేంద్ర మోదీ
    Stampede in India: గత ఏడాది కాలంలో దేశంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇవే.. భారతదేశం

    దిల్లీ

    Manmohan Singh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం మన్మోహన్ సింగ్
    Delhi: న్యూఇయర్ వేళ హస్తినలో ఘోరం.. భార్య వేధింపులతో కేఫ్ యజమాని ఆత్మహత్య భారతదేశం
    Delhi: దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు.. 80కిపైగా విమానాలు ఆలస్యం భారతదేశం
    Delhi Railway Station: రైల్వే స్టేషన్‌లో  'ఉచిత' వీల్‌చైర్ సేవలకు ఎన్నారై నుంచి ₹10,000 వసూలుచేసిన పోర్టర్  భారతదేశం

    బీజేపీ

    Delhi BJP chief : యమునా నదిలో దిల్లీ బీజేపీ అధ్యక్షుడు స్నానం.. శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిక దిల్లీ
    Kharge-Modi : ఖర్గే-మోదీ మధ్య మాటల యుద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌పై పరస్పర విమర్శలు కాంగ్రెస్
    Sadhvi Pragya: సాధ్వి ప్రగ్యాకి తీవ్ర అస్వస్థత.. 'నేను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తాను'  భారతదేశం
    BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్.. రైతులకు రుణమాఫీ, వృద్ధులకు పెన్షన్ పెంపు మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025