NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bajinder Singh: ప్రముఖ పంజాబ్ క్రైస్తవ ప్రవక్త బజీందర్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు 
    తదుపరి వార్తా కథనం
    Bajinder Singh: ప్రముఖ పంజాబ్ క్రైస్తవ ప్రవక్త బజీందర్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు 
    ప్రముఖ పంజాబ్ క్రైస్తవ ప్రవక్త బజీందర్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు

    Bajinder Singh: ప్రముఖ పంజాబ్ క్రైస్తవ ప్రవక్త బజీందర్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 03, 2025
    01:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పంజాబ్‌కు చెందిన ప్రముఖ పాస్టర్, స్వయం ప్రకటిత క్రైస్తవ ప్రవక్త బజీందర్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది.

    బాధిత యువతి ఫిర్యాదు మేరకు, అతను తనను లైంగికంగా వేధించడమే కాకుండా, ఎక్కడికి వెళ్లినా అనుసరిస్తూ బెదిరిస్తున్నాడని కపుర్తల పోలీసులకు వెల్లడించింది.

    22 ఏళ్ల ఈ యువతి తన ఫిర్యాదును పోలీసులకు అందజేసిందని, దీనిపై విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

    అయితే, బజీందర్ సింగ్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఇది తనను లక్ష్యంగా చేసుకున్న కుట్ర అని పేర్కొన్నారు.

    వివరాలు 

    బాధిత యువతి ఫిర్యాదులో వెల్లడించిన విషయాలు 

    పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో బాధితురాలు పలు వివరాలను వెల్లడించింది.

    17 ఏళ్ల వయసులోనే పాస్టర్ తనపై అనవసరంగా ప్రేమ చూపించాడని, తనను ఇష్టానుసారంగా అసభ్యంగా తాకేవాడని పేర్కొంది.

    తనకు పెళ్లి అయిన తర్వాత కూడా వేధింపులు కొనసాగించాడని, అంతేకాకుండా, కుటుంబానికి చెబితే వారికి హాని చేస్తానంటూ బెదిరించాడని ఆరోపించింది.

    2017లో ఆమె తల్లిదండ్రులు బజీందర్ సింగ్ నిర్వహించే 'చర్చ్ ఆఫ్ గ్లోరీ అండ్ విస్డమ్'కు తీసుకెళ్లారని, అప్పటి నుంచి తాను ఆ చర్చికి వెళ్తూ ఉన్నానని వెల్లడించింది.

    ఆ తరువాత పాస్టర్ తన ఫోన్ నంబర్ తీసుకొని అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించాడని పేర్కొంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడ్డానని తెలిపింది.

    వివరాలు 

    గర్భంతో ఉన్నప్పుడు కూడా వేధింపులు

    2022లో ప్రతీ ఆదివారం చర్చ్‌లోని తన కేబిన్‌లో ఒంటరిగా కూర్చోబెట్టేవాడని, ఆ సమయంలో శారీరకంగా వేధించేవాడని బాధితురాలు ఆరోపించింది.

    తాను కాలేజీకి వెళ్తున్నప్పుడు కూడా వెంబడించేవాడని, పెళ్లి అయ్యాక, గర్భంతో ఉన్నప్పుడు కూడా వేధింపులు ఆగలేదని తెలిపింది.

    ఇంకా ఎనిమిది మంది యువతులను కూడా ఇలాగే వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది.

    బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కపుర్తల పోలీసులు ఫిబ్రవరి 23న బజీందర్ సింగ్‌పై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 354-ఏ, 354-డి, 506 కింద కేసు నమోదు చేశారు.

    వివరాలు 

    ఇది కుట్ర: బజీందర్ సింగ్  

    ఈ ఆరోపణలు అన్ని నిరాధారమైనవని, తనపై కావాలనే కుట్ర పన్నినట్లు బజీందర్ సింగ్ చెప్పారు.

    ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో, గత ఐదేళ్లుగా ఒక పాస్టర్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ స్కామ్‌కు తెరలేపాడని తెలిపారు.

    ఆ పాస్టర్ తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేయడానికి ప్రత్యేకంగా ఓ ఛానల్‌ను కూడా ఏర్పాటు చేశాడని ఆరోపించారు.

    గతంలో తాను పారిపోయిన ఆ పాస్టర్ కుమారుడిపై కేసు పెట్టినందుకు ప్రతీకారంగా తనపై ఈ ఆరోపణలు చేయిస్తున్నారని బజీందర్ పేర్కొన్నారు.

    తాను ఫిబ్రవరి 16న ఒక కేసు నమోదు చేయగా, వెంటనే ఫిబ్రవరి 20న తనకు వ్యతిరేకంగా ఆరోపణలు వచ్చాయని తెలిపారు.

    వివరాలు 

    సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్

    ఇంటర్నెట్‌లో బజీందర్ సింగ్ ప్రముఖ క్రైస్తవ మతపరమైన వ్యక్తిగా ప్రాచుర్యం పొందారు.

    పంజాబ్‌లో ఆయన మతపరమైన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతుంటారు. అలాగే, సోషల్ మీడియాలో కూడా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్

    తాజా

    Balakrishna: గాడ్ ఆఫ్ మాస్‌ రీ ఎంట్రీ.. బాలకృష్ణ NBK111 సినిమాకు ముహూర్తం ఫిక్స్! బాలకృష్ణ
    Puri Jagannath: పూరీ-సేతుపతి కాంబోకి ఊహించని టైటిల్.. పేరు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! టాలీవుడ్
    Rinku Singh Engagement: నేడు రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం  రింకూ సింగ్
    Fish Prasadam: చేప ప్రసాదానికి భారీ ఏర్పాట్లు.. ప్రత్యేకంగా 140 స్పెషల్ బస్సులు ఏర్పాటు! హైదరాబాద్

    పంజాబ్

    Farmers Protest: శంభు సరిహద్దులో రైతు మృతి  దిల్లీ
    Farmers Protest: నేడు రైతులతో కేంద్రం నాలుగో దఫా  చర్చలు.. MSPపై ఆర్డినెన్స్‌కు అన్నదాతల డిమాండ్  దిల్లీ
    1,200 ట్రాక్టర్లతో 'ఢిల్లీ చలో'కు సిద్ధమైన రైతులు.. పంజాబ్, హరియాణా సరిహద్దులో హై అలర్ట్  దిల్లీ
    Farmers protest: 'దిల్లీ మార్చ్' ఫిబ్రవరి 29కి వాయిదా.. నేడు సరిహద్దులో కొవ్వొత్తల ర్యాలీ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025