NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Shimla: సిమ్లాలో మునిగిపోతున్న కొండలు.. భౌగోళిక పరిస్థితులే కారణమంటున్న నిపుణులు 
    తదుపరి వార్తా కథనం
    Shimla: సిమ్లాలో మునిగిపోతున్న కొండలు.. భౌగోళిక పరిస్థితులే కారణమంటున్న నిపుణులు 
    సిమ్లాలో మునిగిపోతున్న కొండలు.. భౌగోళిక పరిస్థితులే కారణమంటున్న నిపుణులు

    Shimla: సిమ్లాలో మునిగిపోతున్న కొండలు.. భౌగోళిక పరిస్థితులే కారణమంటున్న నిపుణులు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 27, 2024
    04:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం 'సిమ్లా'. ప్రస్తుతం భౌగోళిక సవాళ్లను ఎదుర్కొంటోంది. కొండచరియలు విరిగిపడటం, భూమి క్షీణత పెరుగుదలతో కొండలు కనుమరుగు అవుతున్నాయి.

    సిమ్లాలో గతేడాది వరదల తర్వాత, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సిమ్లా భూభాగం భద్రతపై సమగ్ర పరిశోధన ప్రారంభించారు.

    ఈ పరిశోధనలో సిమ్లాలోని కొండల రాతి పొరలు, వాటి బలహీనతపై చర్చించారు.

    నీటి ఊట, రాతి పొరలు బలహీనపడటం, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాల్లో, కొండ చరియలు విరిగిపడే ప్రమాదాలు ఉన్నట్లు హెచ్చరీకలు జారీ చేశారు.

    Details

    రాతి పొరలు క్షీణించడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి

    ఉపరితల నీటి నిర్వహణ, క్రమబద్ధమైన నీటి నియంత్రణ ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

    సిమ్లా భౌగోళిక సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే, రాబోయే కాలంలో నగరం తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

    ప్రతి ఏటా కొండల్లోని రాతి పొరలు క్షీణించి, నీటి ఊటతో పాటు, అధిక భారం కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి.

    డాక్టర్ SS రాంధావా నేతృత్వంలో చేపట్టిన సర్వేలో సిమ్లాలోని కామ్లీ బ్యాంక్ ప్రాంతం, ఎంఎల్ఏ క్రాసింగ్, శివ్ బావోరి ప్రాంతాల్లో రాతి ఉపరితలంపై అధిక భారం కారణంగా మునిగిపోవడానికి ఆస్కారం ఉందన్నారు

    Details

    జనాభా పెరుగల కారణంగా  భూభౌగోళిక సమస్యలు

    . ఈ సమస్యలను ఎదుర్కోవడానికి క్రమబద్ధమైన ఉపరితల నీటి నిర్వహణ అవసరమని రాంధావా సూచిస్తున్నారు.

    సిమ్లా నగరం వాస్తవంగా 30,000 మంది మాత్రమే నివసించాలి. ఇప్పుడు 300,000 మందికి పైగా జనాభా ఉన్నారు.

    నగరంలో పెరుగుతున్న జనాభా కారణంగా భూభౌగోళిక సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    భారతదేశం

    China defence budget: భారీగా పెరిగిన చైనా రక్షణ బడ్జెట్‌.. భారత్ కంటే మూడు రెట్లు ఎక్కువ చైనా
    Russia: పంజాబ్ వాసుల ఘోస; పర్యటనకు వెళ్తే.. బలవంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపిన రష్యా రష్యా
    Maldives-India: మాల్దీవుల ప్రజల పక్షాల భారత్‌ను క్షమాపణలు కోరుతున్నా: మాజీ అధ్యక్షుడు నషీద్  మాల్దీవులు
    India- China: అరుణాచల్‌లో మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్ చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025