NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pawan Kalyan: విశాఖ తీరంలో కాలుష్యానికి పరిశ్రమలే కారణం : డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ 
    తదుపరి వార్తా కథనం
    Pawan Kalyan: విశాఖ తీరంలో కాలుష్యానికి పరిశ్రమలే కారణం : డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ 
    విశాఖ తీరంలో కాలుష్యానికి పరిశ్రమలే కారణం : డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్

    Pawan Kalyan: విశాఖ తీరంలో కాలుష్యానికి పరిశ్రమలే కారణం : డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 21, 2024
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు.

    ఈ విషయంపై శాసన మండలిలో (AP Assembly Session) ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సమాధానాలు ఇచ్చారు.

    శాసనసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, పరిస్థితి మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

    పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చే దిశలో ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

    విశాఖలో భారీ పెట్టుబడుల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

    వివరాలు 

    ఘన వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి

    పర్యావరణం,కాలుష్య ప్రభావాలను తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

    ఈ విషయంపై పీసీబీ (పాల్యూషన్ కంట్రోల్ బోర్డు)అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. 2025 జనవరిలో ఈ నివేదిక వస్తుందని,ఆ తరువాత విశాఖలో తగిన చర్యలు చేపడతామని తెలిపారు.

    గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం,కంప్రెస్డ్ బయోగ్యాస్‌ వాడకం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం వంటి అంశాలపై పని జరుగుతోందన్నారు.

    అలాగే,థర్మల్ పవర్ ప్రాజెక్టుల ఫ్లైయాష్ వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు,సిమెంట్ తయారీకి ఈ ఫ్లైయాష్ వాడటం ద్వారా దీన్ని కట్టడి చేస్తామని చెప్పారు.

    విశాఖ,గుంటూరులో ఘన వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని,ఈ పద్ధతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలనుకుంటున్నట్లు చెప్పారు.

    ఎన్జీవోల భాగస్వామ్యంతో కాలుష్య నివారణ చర్యలు చేపడతామని,డిసెంబర్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించి,విశాఖలో ఈ చర్యలపై సమీక్ష చేస్తామని పేర్కొన్నారు.

    వివరాలు 

    విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదు 

    విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ స్పందించారు. ఈ సంస్థను ప్రైవేటీకరించబోమని స్పష్టంగా చెప్పారు.

    కేంద్ర మంత్రిని కలిసినప్పుడు కూడా ప్రైవేటీకరణ తలపెట్టవద్దని కోరినట్లు వివరించారు.

    గతంలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరించబోతున్నప్పుడు తమ ఉత్పత్తులను ఆపినట్లుగా తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    పవన్ కళ్యాణ్

    Bandla Ganesh : పవన్ కళ్యాణ్ నాకు జీవితాన్ని ఇచ్చాడు : బండ్ల గణేష్ బండ్ల గణేష్
    Happy birthday Pawan Kalyan: చిరంజీవి తమ్ముడి నుండి డిప్యూటీ సీఎం దాకా పవన్ ప్రస్థానం   సినిమా
    Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు..  కుప్పం విద్యార్థులు వినూత్న ప్రదర్సన..  వైరల్ అవుతున్న వీడియో   సినిమా
    Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు బర్తడే విషెస్ చెప్పిన బన్నీ అల్లు అర్జున్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025