NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆ హామీలతో ఎన్నికలో బరిలోకి బీజేపీ.. మోదీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
    తదుపరి వార్తా కథనం
    ఆ హామీలతో ఎన్నికలో బరిలోకి బీజేపీ.. మోదీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
    ఆ హామీలతో ఎన్నికలో బరిలోకి బీజేపీ.. మోదీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

    ఆ హామీలతో ఎన్నికలో బరిలోకి బీజేపీ.. మోదీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 18, 2023
    04:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024 లోక్ సభ ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ మాస్టర్ ప్లాన్‌తో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

    ఈ ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయం పాలైన బీజేపీ ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం కసరత్తులను ప్రారంభించింది.

    ప్రజలకు భారంగా ఉన్న ఎల్‌పీజీ ధరలను తగ్గించడం కేంద్రం మరో ముందుడగు వేయనుంది. సిలిండర్లు ధర రూ.1,100 కంటే ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు అగ్రహంగా ఉన్నారు.

    కర్ణాటక వంటి రాష్ట్రాల ఎన్నికలలో కూడా బీజేపీ కూటమికి సిలిండర్ల ధరలు ఒకరకంగా దెబ్బతీశానే చెప్పొచ్చు.

    ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ సిలిండర్ల ధరను తగ్గించడం, PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద చెల్లింపులను పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

    Details

    హార్ ఘర్ జల్ పథకం ప్రతి ఇంటికీ కుళాయి నీటి కనెక్షన్లు

    రాజస్థాన్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎల్‌పిజి సిలిండర్ ను రూ. 500 కు అందిస్తోంది.

    మిగిలిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్‌పిజి సిలిండర్ ను రూ.500 కే ఇస్తామని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ హామీ ఇచ్చారు. దీంతో సిలిండర్ల ధరపై కేంద్రం ఫోకస్ చేసింది.

    అదేవిధంగా 'హార్ ఘర్ జల్' పథకం ద్వారా దేశమంతటా ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్లు అందజేయాలని కేంద్రం భావిస్తోంది.

    నాలుగేళ్ల క్రితం జల్ జీవన్ మిషన్ ప్రారంభించినప్పుడు 67 శాతం కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్‌లు అందించింది. ప్రస్తుతం 100 శాతం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    Details

    పీఎం కిసాన్ నగదును పెంచడానికి ప్రణాళికలు

    పీఎం కిసాన్ కింద రైతులు చెల్లింపులు పెంచాలని చూస్తోంది. ఇప్పటికే ఈ పథకం కింద ఒక్కో రైతులు రూ.2000 చొప్పున మూడు వాయిదాలతో సంవత్సరానికి 6వేలు ఇస్తోంది.

    గత నాలుగు సంవత్సరాల నుండి ధరల విషయంలో ఎలాంటి మార్పు రాలేదు.

    నకిలీ లబ్ధిదారులను తొలగించడానికి ఆధార్, బ్యాంకు ఖాతాల ఆధారంగా ఈ పథకం కింద డబ్బు పొందుతున్న రైతుల సంఖ్యను గత నాలుగు సంవత్సరాల్లో సూమారు 11 కోట్ల నుండి 8.8 కోట్లకు పడిపోవడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    బీజేపీ

    2024లో హాజీపూర్ స్థానం నుంచే పోటీ చేస్తా; చిరాగ్ పాశ్వాన్ సంచలన ప్రకటన చిరాగ్ పాశ్వాన్
    PM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Karnataka: డిప్యూటీ స్పీకర్‌ను అగౌరవపర్చిన 10మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు కర్ణాటక
    KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  కిషన్ రెడ్డి

    కేంద్ర ప్రభుత్వం

    Personal Data Protection Bill: వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం  తాజా వార్తలు
    ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా  ఆంధ్రప్రదేశ్
    Article 370: ఆర్టికల్ 370 పిటిషన్లపై ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టులో విచారణ  ఆర్టికల్ 370
    Tomato: ఆ మూడు రాష్ట్రాల నుంచి టమాట కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం  టమాట
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025