NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Live-In Partner: సోదరుడి సహకారంతో లివ్-ఇన్-పార్టనర్ ని హత్య చేసిన మహిళ
    తదుపరి వార్తా కథనం
    Live-In Partner: సోదరుడి సహకారంతో లివ్-ఇన్-పార్టనర్ ని హత్య చేసిన మహిళ
    సోదరుడి సహకారంతో లివ్-ఇన్-పార్టనర్ ని హత్య చేసిన మహిళ

    Live-In Partner: సోదరుడి సహకారంతో లివ్-ఇన్-పార్టనర్ ని హత్య చేసిన మహిళ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 21, 2024
    08:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గురుగ్రామ్‌లో ఓ మహిళ తన సోదరుడితో కలిసి తన భాగస్వామిని హత్య చేసింది.

    చనిపోయిన యువకుడితో ఆ మహిళ గత ఆరేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తోంది.

    ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్టు చేయగా, మహిళ సోదరుడు పరారీలో ఉన్నాడు.

    గురుగ్రామ్‌లోని అశోక్ విహార్‌లో నివాసం ఉంటున్న నీతు అలియాస్ నిషా (34), విక్కీ (28) గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

    ఆ మహిళకు వివాహమైనా భర్త నుంచి విడిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ 15 ఏళ్ల చిన్నారికి తల్లి.

    Details 

    సోదరుడి సహకారంతో మహిళ హత్య

    న్యూస్ ఏజెన్సీ ప్రకారం, సిటీ కోర్టు నీతును ఒక రోజు పోలీసు కస్టడీకి పంపినట్లు అధికారి తెలిపారు.

    మహిళ సోదరుడు పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్థరాత్రి కచ్చి కాలనీలోని ఓ ఇంట్లో విక్కీ శవమై కనిపించాడు.

    తిక్రి గ్రామంలో తన సోదరుడి సహకారంతో మహిళ హత్య చేసిందని పోలీసులు తెలిపారు.

    విక్కీని ఎవరో హత్య చేశారని మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    శనివారం సదర్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్‌లు 302 (హత్య), 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    Details 

    విక్కీ,నీతు మధ్య వాగ్వాదం

    సదర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ అర్జున్ దేవ్ నేతృత్వంలోని పోలీసు బృందం కేసును ఛేదించి, ఘటా గ్రామానికి చెందిన నీతును ఆదివారం అరెస్టు చేసింది.

    ఆమె వద్ద నుంచి విక్కీ మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ.. శుక్రవారం అర్ధరాత్రి నీతూ, ఆమె సోదరుడు విక్కీ గదికి చేరుకున్నారని ఆమె సోదరుడు విక్కీ కలిసి మద్యం సేవించారని, ఆ తర్వాత వీరి మధ్య వాగ్వాదం జరిగిందని నిందితురాలు నీతూ వెల్లడించింది.

    ఇంతలో నీతూ విక్కీపై దాడికి పాల్పడింది. విక్కీ మెడ, తలపై గట్టి కొట్టడంతో అతను మరణించాడు. కేసును తప్పుదోవ పట్టించేందుకు నీతూ, విక్కీ మొబైల్‌తో పారిపోయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గురుగ్రామ్‌

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    గురుగ్రామ్‌

    Gurugram: భార్యను చంపి..కుమారుడిని గదిలో బంధించి.. భర్త ఆత్మహత్య  భారతదేశం
    Divya Pahuja: గురుగ్రామ్ హోటల్‌లో మాజీ మోడల్ దివ్య పహుజా హత్య భారతదేశం
    Divya Pahuja: హర్యానా కాలువలో మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం గుర్తింపు హర్యానా
    Gurugram: గురుగ్రామ్ లో దారుణం.. 14 ఏళ్ళ బాలిక గొంతు కోసి పారిపోయిన దుండగుడు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025