NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Women's Day: భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళా నాయకురాళ్లు వీళ్లే
    Women's Day: భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళా నాయకురాళ్లు వీళ్లే
    1/2
    భారతదేశం 1 నిమి చదవండి

    Women's Day: భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళా నాయకురాళ్లు వీళ్లే

    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 08, 2023
    10:00 am
    Women's Day: భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళా నాయకురాళ్లు వీళ్లే
    భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళా నాయకురాళ్లు వీళ్లే

    పురుషాధిక్య భారతీయ సమాజంలో మహిళలకు రాజకీయాల్లో పరిమిత సంఖ్యలో అవకాశాలు దక్కాయి. కాలానుగూనంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో కొందరు నాయకురాళ్లు స్వశక్తితో ఎదిగి దేశ రాజకీయాల్లో తమదైన ముద్రవేశారు. ఇందిరా గాంధీ: భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మహిళా రాజకీయ నాయకురాలుగా ఇందిరా గాంధీ పేరుగాంచారు. 1966లో భారతదేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు. సుచేతా కృప్లానీ: దేశంలోనే కాకుండా ఉత్తర్‌ప్రదేశ్‌కు మొదటి మహిళా ముఖ్యమంత్రిగా సుచేతా గుర్తింపు పొందారు. భారత మొదటి మహిళా గవర్నర్ కూడా ఈమెనే. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. జయలలిత: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత పనిచేశారు. తమిళ ప్రజలు ఆమెను 'అమ్మా' అని సంబోధించేవారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ఆమె లక్షలాది మంది ప్రజలకు ఆరాధ్య దైవం.

    2/2

    వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం ప్రెసిడెంట్‌గా పని చేసిన సోనియా

    సోనియా గాంధీ: అన్ని కాలాల్లోనూ గొప్ప మహిళా రాజకీయ నాయకుల్లో సోనియా గాంధీ ఒకరు. వంద ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో 9వ స్థానంలో నిలిచారు. సుష్మా స్వరాజ్: బీజేపీలో చిన్నమ్మగా పేరు గాంచిన సుష్మా దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. కేంద్ర విదేశాంగ మంత్రిగా కీలక పాత్రను పోషించారు. దిల్లీకి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా సేవలందించారు. మమతా బెనర్జీ: బెంగాల్‌కు మొదటి మహిళా ముఖ్యమంత్రిగా సమకాలిన భారత రాజకీయాలను శాసిస్తున్న మహిళా నేత మమతా బెనర్జీ. దేశానికి మొదటి మహిళా రైల్వేమంత్రి మమతే కావడం గమనార్హం. ప్రస్తుతం టీఎంసీ అధినేత్రగా మమత ప్రధాని పీఠంపై కన్నేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    మహిళా దినోత్సవం
    మహిళ

    మహిళా దినోత్సవం

    అంతర్జాతీయ మహిళా దినోత్సవం: తెలుగు సినిమా దశను మార్చిన హీరోయిన్స్ సినిమా
    అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకుందాం అంతర్జాతీయ మహిళల దినోత్సవం
    women's day 2023: 'ఉమెన్స్ డే' రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ

    మహిళ

    హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలియజేసే టిప్స్, ఆడవాళ్ళకు మాత్రమే హోళీ
    నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం నాగాలాండ్
    మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే; ఆరోసారి కప్పు కైవసం ఉమెన్ టీ20 సిరీస్
    Women's T20 World Cup Final:టైటిల్ పోరులో రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఢీ ఉమెన్ టీ20 సిరీస్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023