NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati: అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టు.. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధాని!
    తదుపరి వార్తా కథనం
    Amaravati: అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టు.. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధాని!
    అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టు.. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధాని!

    Amaravati: అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టు.. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధాని!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 21, 2024
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముఖ్యంగా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. ఇప్పటికే అమరావతిలో వివిధ నిర్మాణాలు ప్రారంభించారు. ః

    ఐకానిక్ టవర్స్, 100 ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనం, వరదనీటి నిర్వహణ కోసం కెనాల్స్, రిజర్వాయర్లు, వాకింగ్ మరియు సైక్లింగ్ ట్రాకులు, ఇలా అన్ని అవసరమైన సౌకర్యాలు అమరావతిలో అందుబాటులోకి రానున్నాయి.

    ఈ పనులు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన ప్రాజెక్టు అమలుకు సిద్ధమవుతోంది.

    అమరావతిని దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దేందుకు భారతీయ ఆయిల్ కార్పొరేషన్ ముందుకొచ్చింది.

    Details

    గ్యాస్ పైపులైన్ల నిర్మాణం

    గుజరాత్‌లో ఉన్న గిఫ్ట్ సిటీ తరహాలో అమరావతిలో కూడా పైప్డ్ గ్యాస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.

    ఈ ప్రాజెక్టును పలు అంశాలలో చర్చించేందుకు ఐవోసీ ప్రతినిధులు, పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ బోర్డు సభ్యులతో కలిసి ఏపీ ప్రభుత్వ కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌తో సమావేశమయ్యారు.

    ఈ సమావేశంలో గ్యాస్ పైపులైన్ల నిర్మాణం, ఇతర అవసరమైన ప్రాజెక్టుల గురించి చర్చలు జరిగాయి.

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అంగీకరించడంతో, త్వరలో అమరావతిలో గ్యాస్ సరఫరా కోసం భూగర్భంలో పైప్లైన్ల నిర్మాణం మొదలు కానుంది.

    గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీతో పోలిస్తే, ఇందులో అన్ని సౌకర్యాలు భూగర్భంలోనే ఏర్పాటు చేయనున్నారు.

    Details

    భవిష్యత్తులో మంగళగిరి ప్రాంతాలకు

    ఇందులో భాగంగా విద్యుత్ సరఫరా, గ్యాస్, వ్యర్థాలను కూడా భూగర్భంలో పైపుల ద్వారా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

    దీంతో విద్యుత్ సంబంధిత ప్రమాదాలు, గ్యాస్ సరఫరా విషయంలో సమస్యలు తలెత్తకుండా చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు అమలు చేయనున్నారు.

    భవిష్యత్తులో మంగళగిరి, అమరావతి తదితర ప్రాంతాలకు కూడా ఈ పైప్డ్ గ్యాస్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. తద్వారా అమరావతి మరింత ఆధునిక నగరంగా ఎదగడం ఖాయమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: ఏపీ రెరా వద్ద పెండింగ్‌లోని 85 దస్త్రాల పరిష్కారం భారతదేశం
    Andhrapradesh: రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం  అమరావతి
    New tourism policy: కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం భారతదేశం
    Ap Government: ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్‌లు.. ఈసారి ముందుగానే! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025