NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఒడిశాలో జపాన్ మియాజాకి రకాన్ని సాగు చేస్తున్న టీచర్.. కిలో మామిడి రూ.3 లక్షలు 
    తదుపరి వార్తా కథనం
    ఒడిశాలో జపాన్ మియాజాకి రకాన్ని సాగు చేస్తున్న టీచర్.. కిలో మామిడి రూ.3 లక్షలు 
    కిలో మామిడి రూ.3 లక్షలు

    ఒడిశాలో జపాన్ మియాజాకి రకాన్ని సాగు చేస్తున్న టీచర్.. కిలో మామిడి రూ.3 లక్షలు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 27, 2023
    04:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి 'మియాజాకి'ని ఇప్పుడు భారతదేశంలోనూ పండిస్తున్నారు.ఇంటర్నేషనల్ మార్కెట్లో కిలో మామిడి రూ. 2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండటం దీని ప్రత్యేకత.

    ఈ పండ్ల సాగును తొలుత జపాన్ లోనే పండించారు. దీని అసలు పేరు టైయో నొ టమగోగా పిలుస్తారు. ఎగ్ ఆఫ్‌ ది సన్‌ అని కూడా అంటారు.

    ఖరీదైన మియాజాకి ఫలాన్ని ఒడిశాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు పండిస్తున్నారు. ఓ వైపు టీచర్ గా పాఠాలు చెబుతూ మరోవైపు మామిడి తోటలో శ్రమిస్తున్నారు. కలహండి జిల్లాలోని కందుల్‌గూడ గ్రామంలో రక్షాకర్‌ భోయ్‌ ఖరీదైన మామిడి తోటను సాగు చేస్తున్నారు.

    ఉద్యానవనశాఖ అధికారుల సహకారంతో మియాజకి మామిడి విత్తనాలను సేకరించానని రక్షాకర్‌ వెల్లడించారు.

    DETAILS

    ఈ పండు తీసుకుంటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి

    ప్రత్యేకమైన రంగు సంతరించుకున్న మియాజాకి అమోఘమైన రుచి దాగుంది. సాంప్రదాయ రకాలైన బంగినపల్లి, తోతాపురి, నూజివీడు రకాలతో పోల్చితే ఇది చాలా భిన్నమైంది.

    ఇందులో ఏ, సీ విటమిన్లు సహా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా నిక్షిప్తమై ఉన్నాయి. ఈ పండు తీసుకుంటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అంది వ్యాధులను తట్టుకుని నిలబడే శక్తిని సొంతం చేసుకోవచ్చని చెబుతుంటారు.

    మాక్రో పోషకాలైన ఫైబర్‌, పొటాషియం, మెగ్నీషియం నిలువలు ఈ మ్యాంగోలో ఉండటంతో విదేశాల్లోనూ వీటికి డిమాండ్ భారీగా ఉంటుందని రక్షాకర్‌ చెప్పుకొచ్చారు.

    ఏటా ఏప్రిల్‌లో మియాజాకిని మార్కెట్లో అత్యుత్తమైన మామిడి పండ్లుగా వేలం వేస్తారు. ఇటీవలే సిలిగురి, రాయ్‌పుర్‌, శిలిగుడిలో నిర్వహించిన మ్యాంగో ఫెస్టివల్స్‌ లో దీన్ని ప్రదర్శనకు ఉంచడం విశేషం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    జపాన్ మియాజాకి రకాన్ని సాగు చేస్తున్న టీచర్

    #WATCH | Odisha: A teacher from Kandulguda Village of Kalahandi district, succeeded in growing a special variety of mango called as 'Miyazaki' which costs Rs 2.5 lakhs to 3 lakhs per kg in the international market for its unique taste. (26.07) pic.twitter.com/c1Nb2P85uc

    — ANI (@ANI) July 27, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    జపాన్

    తాజా

    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి
    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల

    ఒడిశా

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్

    జపాన్

    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి కరోనా కొత్త మార్గదర్శకాలు
    జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన టెక్నాలజీ
    'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా చైనా
    ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025