Page Loader
Revanth Reddy: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు
టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు

Revanth Reddy: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సిద్ధమైన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామక నిబంధనలపై సీఎం తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆలయంతో సమానంగా,యాదగిరిగుట్ట ఆలయం పరిసరాల్లో రాజకీయప్రభావం లేకుండా చూడాలని,ఆలయపవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ధర్మకర్తలమండలి నియామకం అలాగే ఆలయం తరఫున నిర్వహించాల్సిన ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలకు సంబంధించి ముసాయిదా నిబంధనల్లో ముఖ్యమంత్రి పలు మార్పులను సూచించారు. ఈసమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.