
Bajinder Singh: అత్యాచారం కేసులో సెల్ఫ్ స్టైల్డ్ క్రిస్టియన్ పాస్టర్ బాజిందర్ సింగ్కు జీవితఖైదు
ఈ వార్తాకథనం ఏంటి
అత్యాచారం కేసులో సెల్ఫ్ స్టైల్డ్ క్రిస్టియన్ పాస్టర్ బాజిందర్ సింగ్కు పంజాబ్ కోర్టు శిక్ష ఖరారు చేసింది.
ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ ఈ రోజు సంచలన తీర్పు వెలువరించింది.
'యేసు యేసు ప్రాఫెట్' గా పాపులర్ అయిన బాజిందర్ సింగ్ పై 2018లో పంజాబ్ state's జిరాక్పూర్ అనే ప్రాంతానికి చెందిన ఒక మహిళ అత్యాచారం ఆరోపణ చేసింది.
ఆమె చెప్పినట్లు, బాజిందర్ సింగ్ ఆమెను విదేశాలకు తీసుకెళ్లే మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకున్నాడని ఆరోపించింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాలు
జీవిత ఖైదు విధిస్తూ తీర్పు
ఈ కేసు విచారణ నిర్వహించిన ట్రయల్ కోర్టు,నాలుగు రోజుల క్రితం బాజిందర్ సింగ్ను దోషిగా తేల్చింది,మిగతా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో,ఈ రోజు అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.
బాజిందర్ సింగ్ తరచూ వివాదాల్లోఉంటుంటాడు. ఇటీవల,ఆయన తన కార్యాలయంలో ఓ మహిళ, మరో వ్యక్తిపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ వీడియోలో చెంపలపై కొట్టడం,చేతికి దొరికిన వస్తువులతో దాడి చేయడం వంటి దృశ్యాలు ఉన్నాయి. 2022లో,ఓ 22 ఏళ్ల మహిళ సింగ్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది.
అదే ఏడాది, అనారోగ్యంతో ఉన్న ఒక మహిళను బాగుచేస్తానని చెప్పి ఆమె కుటుంబం నుండి భారీగా డబ్బులు వసూలు చేశాడు. కానీ ఆమె మరణించింది.