
Andhra Pradesh: యోగాంధ్ర గిన్నిస్ రికార్డు.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. యోగా ప్రజలను మరోసారి ఏకతాటిపైకి తెచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్యమాన్ని బలోపేతం చేసినందుకు ఏపీ ప్రజలను ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం ఎంతోమందిని ఆరోగ్యకర జీవనానికి ప్రేరేపిస్తుందని ప్రధాని మోదీ అన్నారు
Details
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి విజయమిది: చంద్రబాబు
ఒకే లక్ష్యానికి అందరూ ఐక్యంగా ఉన్నప్పుడు ఏం సాధించగలమో నిరూపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా డే సందర్భంలో విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఏపీ సాధించిన గిన్నిస్ రికార్డు రాష్ట్ర ప్రజలందరి విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అద్భుత ఘనతను సాకారం చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఉత్సాహం, అంకితభావం ఎంతో ప్రేరణాత్మకమని చంద్రబాబు అన్నారు. యోగాంధ్ర రికార్డులో భాగస్వాములైన అందరినీ ముఖ్యమంత్రి అభినందించారు.