తదుపరి వార్తా కథనం

PM Modi: విశాఖలో 'యోగాంధ్ర' ఉత్సవం.. యోగాసనాలు వేసిన ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jun 21, 2025
07:56 am
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు నేతలు యోగాసనాలు వేశారు. కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ యోగా స్మారక పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. 'యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్' అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగాసనాలు ప్రదర్శించారు.