NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ATM: రైల్లో ప్రయాణం చేస్తూనే నగదు తీసుకోవచ్చు.. సెంట్రల్‌ రైల్వే నూతన ప్రయోగం
    తదుపరి వార్తా కథనం
    ATM: రైల్లో ప్రయాణం చేస్తూనే నగదు తీసుకోవచ్చు.. సెంట్రల్‌ రైల్వే నూతన ప్రయోగం
    రైల్లో ప్రయాణం చేస్తూనే నగదు తీసుకోవచ్చు.. సెంట్రల్‌ రైల్వే నూతన ప్రయోగం

    ATM: రైల్లో ప్రయాణం చేస్తూనే నగదు తీసుకోవచ్చు.. సెంట్రల్‌ రైల్వే నూతన ప్రయోగం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 16, 2025
    11:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    త్వరలో రైళ్లలోనూ ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు షాపింగ్‌ మాల్స్‌, కార్యాలయాల్లో చూస్తున్న ఈ సదుపాయం.. త్వరలో కదిలే ఏటీఎంల రూపంలో ప్రయాణికుల దరికి చేరనుంది.

    ఈ విధంగా, ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు రైల్వే శాఖ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

    ఈ క్రమంలో సెంట్రల్‌ రైల్వే విభాగం తొలిసారిగా ముంబయి-మన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ఏటీఎంను ఏర్పాటు చేసింది. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవలను త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు.

    Details

     పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ఎటిఎం

    ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినస్‌ నుంచి మన్మాడ్‌ జంక్షన్‌ దాకా నిత్యం నడిచే పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంను ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేశారు.

    ఈ ఏటీఎంను గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా ఉపయోగించిన స్థలంలో ఏర్పాటు చేయగా, భద్రత దృష్ట్యా ప్రత్యేకంగా షట్టర్‌ డోర్‌ అమర్చారు.

    మరిన్ని మార్పులను మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ విధంగా రైలు కదులుతున్నప్పుడు ప్రయాణికులు ఏటీఎం సేవలను సురక్షితంగా వినియోగించగలుగుతారు.

    ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా ప్రయాణికుల కోసం సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని, త్వరలోనే ఇతర మార్గాల్లో నడిచే రైళ్లలోనూ ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశముందని రైల్వే శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా
    రైల్వే బోర్డు

    తాజా

    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా

    ఇండియా

    Smita Sabharwal: వ్యవసాయ వర్సిటీ కీలక నిర్ణయం.. స్మితా సభర్వాల్‌కి నోటీసులు..? భారతదేశం
    Medigadda Barrage: మేడిగడ్డ కుంగుబాటు.. 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు! తెలంగాణ
    Sudha Murthy: నా భర్త మాత్రమే కాదు.. మరెందరో 90 గంటలు పనిచేస్తున్నారు : సుధా మూర్తి ఇన్ఫోసిస్
    Haryana: హర్యానాలో భారీ పేలుడు కలకలం.. నలుగురు కుటుంబ సభ్యులు మృతి హర్యానా

    రైల్వే బోర్డు

    రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా  జయవర్మ సిన్హా
    రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా రైల్వే స్టేషన్
    IRCTC Site-App Down: IRCTC డౌన్.. యాప్, వెబ్‌సైట్‌ను ఉపయోగించడంలో ఇబ్బంది  టెక్నాలజీ
    Special Trians: తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్.. వీకెండ్ లో ఈ నగరాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025