NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్
    పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్

    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 19, 2025
    03:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పై గూఢచర్య కేసులో భారీ షాక్ తగిలింది.

    పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)తో సంబంధాలున్నాయని ఆరోపణలు రావడంతో జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మెటా సంస్థ బ్లాక్ చేసి సస్పెండ్ చేసింది.

    అయినప్పటికీ ఆమె యూట్యూబ్ ఛానెల్ 'ట్రావెల్ విత్ జో' ఇంకా అందుబాటులో ఉంది.

    జ్యోతి మల్హోత్రాను సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందిస్తున్నారంటూ ఆరోపణల తర్వాత శనివారం అరెస్టు చేశారు. 2023లో పాక్‌కు కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొందుకుని వెళ్లింది.

    Details

    ఇన్ఫార్మర్లుగా ఐదుగురు వ్యక్తులు

    పాక్ అధికారులకు అనుమానం రాకుండా కీలక సమాచారాన్ని అందిస్తున్నట్లు గుర్తించారు.

    అంతేకాక ఆమెతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

    వీరు భారతదేశంలోని ముఖ్య ప్రాంతాల సమాచారం పాక్ తో పంచుకున్నారు. దర్యాప్తు లో ఆమె పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది.

    ఆమె అతడితో పాటు బాలి, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా అంతర్జాతీయ ప్రయాణాలు చేసింది.

    జ్యోతి మల్హోత్రాపై భారతీయ న్యాయసంహితలో సెక్షన్ 152 సహా పలు కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు సమయంలో ఆమె తప్పు ఒప్పుకుంది.

    Details

    వీడియోను పాక్ ఏజెంట్లతో పంచుకున్నట్లు సమాచారం

    అలాగే, ఆమెతో పాటు మరో ఐదుగురు సహకారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    పహల్గాం ఉగ్రదాడికి కొన్ని నెలల ముందే జ్యోతి ఆ ప్రాంతంలో పర్యటించి వీడియోలు తీసినట్లు దర్యాప్తు లో వెల్లడయింది. ఆ వీడియోలను పాక్ ఏజెంట్లతో పంచుకున్నారని అనుమానిస్తున్నారు.

    అలాగే, జమ్ము కశ్మీర్‌లో తరచూ పర్యటన చేసి, చైనా కూడా పర్యటించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు ఇంకా విస్తరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జ్యోతి మల్హోత్రా

    తాజా

    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ జ్యోతి మల్హోత్రా
    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు
    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి
    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా

    జ్యోతి మల్హోత్రా

    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025