
Spying: పాకిస్తాన్ ఐఎస్ఐ తరుపున గూఢచర్యం.. హర్యానా యూట్యూబర్ అరెస్ట్..
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాలోని యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ తరపున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా, హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్పై కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ (ఐఎస్ఐ) తరఫున గూఢచర్యం చేసినట్టు పోలీసుల ఆధారాలతో ఆరోపణలు ఎదురయ్యాయి. మేవాట్ హిస్టరీపై యూట్యూబ్ లో వీడియోలు చేసిన పాల్వాల్ జిల్లాలోని కోట్ గ్రామానికి చెందిన అక్రమ్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో వసీం అక్రమ్ గత మూడు సంవత్సరాలుగా పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధం కలిగి ఉన్నాడని తేలింది. వీరికి అవసరమైన సిమ్ కార్డులను కూడా అందించినట్లు పోలీసులు గుర్తించారు. వసీం అక్రమ్ వాట్సాప్ చాట్లలో నేరపూరితమైన సందేశాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
వివరాలు
పాకిస్తాన్ గూఢచారి తౌఫిక్ అరెస్ట్
తొలగించిన సందేశాలను తిరిగి పొందేందుకు అతని మొబైల్ ఫోరెన్సిక్ విభాగానికి కింది స్థితిలో తరలించబడింది. ఇప్పటికే పాల్వాల్ పోలీసులు మరో పాకిస్తాన్ గూఢచారి తౌఫిక్ను గత వారం అరెస్ట్ చేశారు. ఈ తౌఫిక్,వసీం అక్రమ్కు సంబంధించి సమాచారాన్ని పోలీసులు అందించారు. దర్యాప్తు ప్రకారం,2021లో వసీం అక్రమ్ పాకిస్తాన్ వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు పాకిస్తాన్ ఏజెంట్ డానిష్తో పరిచయం ఏర్పడింది. అక్రమ్, తౌఫిక్ ఇద్దరూ ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ఐఎస్ఐ, పాకిస్తాన్ హైకమిషన్తో సంప్రదింపులు జరిపారు వీరు ఇద్దరు భారత్కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు అందిస్తూ ఉన్నారు. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎష్పీ వరణ్ సింగ్లా చెప్పారు. అంతేగాక,ఈ దర్యాప్తులో ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా పాల్గొంటున్నట్లు అధికారులు వెల్లడించారు.