NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ys Jagan: అసెంబ్లీకి వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ys Jagan: అసెంబ్లీకి వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!
    అసెంబ్లీకి వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!

    Ys Jagan: అసెంబ్లీకి వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 22, 2025
    06:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.

    ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీలో హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

    ఇంతకుముందు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో తనకు సరైన గౌరవం లభించదన్న అనుమానం వ్యక్తం చేయడంతో, ఆయన గైర్హాజరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

    అసెంబ్లీకి హాజరుకావడం లేదనే కారణంతో జగన్‌పై అనర్హత వేటు పడే అవకాశముందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.

    Details

    షర్మిల విమర్శల తర్వాత జగన్ నిర్ణయం 

    ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కూడా అసెంబ్లీకి రాకపోవడంపై విమర్శలు చేశారు.

    అసెంబ్లీకి రావడానికి జగన్‌కు మొహం లేదంటూ వ్యాఖ్యానించిన ఆమె, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం జగన్‌కు లేదా? అంటూ ధ్వజమెత్తారు.

    ఈ నేపథ్యంలో జగన్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.

    బడ్జెట్, సూపర్ 6 హామీలపై ప్రశ్నలు

    ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల హామీల అమలు తీరుపై ప్రశ్నించాలనే వ్యూహంతో జగన్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

    'సూపర్ 6' హామీల అమలు, నిధుల కేటాయింపు వంటి అంశాలపై వైసీపీ ప్రశ్నించే అవకాశం ఉంది

    Details

    కేవలం గవర్నర్ ప్రసంగానికే పరిమితమా?

    అయితే జగన్ అసెంబ్లీకి హాజరవ్వాలని తీసుకున్న నిర్ణయం వెనుక మరో వ్యూహం ఉందన్న చర్చ కూడా సాగుతోంది.

    జగన్ కేవలం గవర్నర్ ప్రసంగం వరకు మాత్రమే అసెంబ్లీలో ఉండి, ఆ తర్వాత మళ్లీ సమావేశాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.

    టీడీపీ నాయకులు పలు మార్లు అసెంబ్లీకి వరుసగా 60 రోజులు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు.

    ఈ నేపథ్యంలో జగన్ తన సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Weather Update: ఏపీలో ఉక్కపోత, తెలంగాణలో జల్లుల తాకిడి ఆంధ్రప్రదేశ్
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్
    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి వరదలు
    Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం  కేంద్ర ప్రభుత్వం

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    వచ్చే ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు రాకపోవచ్చు: సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
    జగన్ మాదిరిగా మేం ఆలోచించం : మౌన దీక్షలో పవన్ కల్యాణ్  పవన్ కళ్యాణ్
    CM Jagan: డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్‌  ఆంధ్రప్రదేశ్
    Journalist houses In Ap : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. కొనసాగుతున్న భేటీ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025