Page Loader
వివేక హత్య విషయం వైఎస్ జగన్ కు ముందే తెలుసు: వైఎస్ సునీత

వివేక హత్య విషయం వైఎస్ జగన్ కు ముందే తెలుసు: వైఎస్ సునీత

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 13, 2023
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టిన ఇన్వెస్టిగేషన్ కు ఎంపీ అవినాష్‌రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదని వైఎస్ సునీత స్వయంగా సుప్రీంలో వాదనలు వినిపించారు. ఏప్రిల్‌ 24 తర్వాత 3 సార్లు ఈ మేరకు నోటీసులిచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదన్నారు. అయితే అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకే తల్లి అరోగ్యాన్ని అడ్డుగా పెట్టుకున్నాడని సుప్రీంకు వివరించారు. ఎంపీ అవినాష్ ను అదుపులోకి తీసుకుందామని వెళ్లిన సీబీఐ అధికారులను ఆయన అనుచరులు, మద్దతుదారులు అడ్డుకున్నారన్నారు. సాక్షులను సైతం బెదిరిస్తూ ఇతర నిందితులతో కలిసి అవినాష్ ప్రభావితం చేస్తున్నారని కోర్టుకు చెప్పారు. వైఎస్ అవినాష్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని, ఆయనకు అధికార పార్టీ కీలక వ్యక్తుల మద్దతు సైతం ఉందని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

DETAILS

సీబీఐ సేకరించిన సాక్ష్యాలను 

సీబీఐ అధికారులపై అవినాష్ తప్పుడు ఫిర్యాదులు చేస్తూ, అధికారులపై ప్రైవేట్‌ కేసులు నమోదు చేయించారన్నారు. అయితే వివేకా హత్య గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ కు ముందే తెలిసిందని సునీత కోర్టుకు వివరించారు. సునీత వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై దాఖలైన పిటిషన్‌ ను సుప్రీం విచారించింది. దీనిపై విచారణలో భాగంగా స్వయంగా సునీత వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఎంపీ అవినాష్ పై పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ సంపాదించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చిందన్నారు.