
YSR Kadapa: వైఎస్సార్ జిల్లాకు మళ్లీ పాత పేరు.. జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ జిల్లాకు మళ్లీ 'వైఎస్సార్ కడప జిల్లా' అనే పూర్వ నామాన్ని పునరుద్ధరిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు అనుగుణంగా తాజాగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
వివరాల్లోకి వెళితే, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం కడప జిల్లాను 'వైఎస్సార్ కడప జిల్లా'గా పేరు మార్చారు.
అయితే, తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 'కడప' అనే పదాన్ని తొలగించి కేవలం 'వైఎస్సార్ జిల్లా'గా వ్యవహరించడం ప్రారంభించింది.
ఈ చర్యపై అప్పట్లో పౌరహక్కుల సంఘాలు,ప్రజాసంఘాలు,రాజకీయ పార్టీలు తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేశాయి.
జిల్లాకు చెందిన చారిత్రక ప్రాధాన్యతను తొలగించారని ఆరోపణలు వెలువడ్డాయి.
వివరాలు
ప్రజల నుంచి కూడా అనేక అభ్యర్థనలు
అంతేకాక,గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించినప్పుడు,తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా అసలైన పేరును తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ఇటీవలి కాలంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా ఇదే అంశంపై ముఖ్యమంత్రికి లేఖ రాసి,గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపట్టారు.
కడప అనే పదాన్ని తొలగించి కేవలం వైఎస్సార్ జిల్లా అనే పేరును పెట్టడాన్ని ఆయన తప్పుగా పేర్కొన్నారు.
ఈఅంశంపై ప్రజల నుంచి కూడా అనేక అభ్యర్థనలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి.
వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుని,ప్రభుత్వం జిల్లా పేరును తిరిగి 'వైఎస్సార్ కడప జిల్లా'గా మార్చాలన్న స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది.
దాంతో మంత్రివర్గ ఆమోదాన్ని పొందిన అనంతరం ప్రభుత్వం తాజాగా అధికారిక జీవోను విడుదల చేసింది.