NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే
    తదుపరి వార్తా కథనం
    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే
    రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే

    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే

    వ్రాసిన వారు Stalin
    Jul 27, 2023
    03:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లుపై రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

    అలాగే మణిపూర్‌ సమస్యపై నరేంద్ర మోదీ ప్రభుత్వంపై లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా కేంద్రానికి మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

    రాజ్యసభలో 9మంది, లోక్‌సభలో 22 మంది సభ్యులున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు మోదీ ప్రభుత్వానికి కీలకం కానుంది.

    రాజ్యసభలో బీజేపీ ప్రభుత్వానికి మోజార్టీ సభ్యులు లేదు. దీంతో రాజ్యసభలో వైసీపీ మద్దతు ఉంటేనే దిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందుతుంది.

    మోదీ సర్కార్‌కు అనుకూలంగా వైసీపీ తీసుకున్న నిర్ణయంతో దిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమోదం పొందనుంది.

    దిల్లీ

    మణిపూర్‌ పరిస్థితిపై సమగ్ర చర్చ జరగాలి: ప్రతిపక్షాల డిమాండ్

    దిల్లీలో సేవలను నియంత్రించే లక్ష్యంతో కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకొస్తుంది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్ (సవరణ) బిల్లు స్థానంలో కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొస్తోంది.

    బ్యూరోక్రాట్ల బదిలీలు, నియామక అధికారాలు ఎన్నికైన దిల్లీ ప్రభుత్వానికి ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా దిల్లీ బ్యూరోక్రాట్‌లపై నియంత్రణను కేంద్రానికి కల్పించే విధంగా ఈ ఆర్డినెన్స్‌ను రూపొందించారు.

    రెండు అంశాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఎన్డీటీవీకి తెలిపారు. అయితే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని 'ఇండియా' డిమాండ్ చేస్తోంది.

    మణిపూర్‌లో పరిస్థితిపై సమగ్ర చర్చ జరగాలని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ ఆర్డినెన్స్
    దిల్లీ
    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Bharti Airtel: ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ ఆఫర్‌ ఎయిర్ టెల్
    Geeta Samota: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా CISF అధికారిణి గీతా సమోటా రాజస్థాన్
    AI tutors: విద్యా రంగంలో విప్లవం.. భవిష్యత్తు బోధనలో ఏఐ ట్యూటర్లే ప్రధాన పాత్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్‌ మెసేజ్‌..చూస్తే గూస్ బంప్స్ ఖాయం ఆపరేషన్‌ సిందూర్‌

    దిల్లీ ఆర్డినెన్స్

    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! దిల్లీ

    దిల్లీ

    దిల్లీలో కుండపోత వర్షాలు.. జలమయమైన రోడ్లు, ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్న యమునా  వర్షాకాలం
    ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు వరదలు
    దిల్లీలో వేదికగా భగ్గుమన్న అగ్రరాజ్యాలు.. చైనీస్ అంశాల్లో జోక్యం ఆపాలని అమెరికాకు చైనా హెచ్చరికలు అమెరికా
    దిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    నెల్లూరులో హాట్ పాలిటిక్స్.. సోమిరెడ్డి మాటలకు ఇరుకున పడ్డ వైసీపీ నేత ఆదాల ఆంధ్రప్రదేశ్
    యాత్ర-2 మోషన్ పోస్టర్ వచ్చేసింది..'గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' తెలుగు సినిమా
    ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా ఆంధ్రప్రదేశ్
    సీఎం కోసం కొబ్బరి చెట్లు నరకడంపై పవన్ చురకలు.. పుష్ప విలాపం చదవకపోతే ఇలాగే ఉంటుందని ఎద్దేవా పవన్ కళ్యాణ్

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    నేడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ -2023; అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బుగ్గన రాజేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    వివేకా హత్య కేసు: 'అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేం'; అవినాష్ రెడ్డికి తేల్చి‌చెప్పిన హైకోర్టు హైకోర్టు
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025