ప్రతిష్టాత్మక కోల్కతా ట్రామ్కు 150 ఏళ్లు.. దుర్గా పూజా విశేషాలతో ప్రత్యేక అలంకరణ
పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ సహా కోల్కతా ట్రామ్ కారు సేవలు ప్రారంభమై 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ట్రామ్ను రూపొందించారు. 1873లో తొలి ట్రామ్ ప్రారంభమైంది. ట్రామ్ లోపలే కాకుండా బయట కూడా అందమైన చిత్రాలతో అలకరించడం ఆకట్టుకుంటోంది.ఈ ట్రామ్ టోలీగంజ్- బాలీగంజ్ మధ్య కొత్త సంవత్సరం -2023 వరకు సేవలను అందించనుంది. చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలను కలుపుతూ ఈ ట్రామ్ సాగనుంది. దీన్ని ఏషియన్ పెయంట్స్, XXL కలెక్టివ్తో కలిసి బెంగాల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ జాయింట్ ప్రాజెక్టుగా చేపట్టింది. తొలి బోగిలో దుర్గా విగ్రహాలను సుందరంగా చెక్కి,అమ్మవారి పూజా విశేషాలను పొందుపర్చారు. సింధూర్, ధునుచి నృత్య కళాకారుల బొమ్మలనూ అందంగా గీశారు. రెండో బోగిని సంస్కృతిని తెలిపేలా తీర్చిదిద్దారు.