NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Air pollution: వాయు కాలుష్యం కారణంగా.. ఏటా 1.5 మిలియన్ల మంది మృతి  
    తదుపరి వార్తా కథనం
    Air pollution: వాయు కాలుష్యం కారణంగా.. ఏటా 1.5 మిలియన్ల మంది మృతి  
    వాయు కాలుష్యం కారణంగా.. ఏటా 1.5 మిలియన్ల మంది మృతి

    Air pollution: వాయు కాలుష్యం కారణంగా.. ఏటా 1.5 మిలియన్ల మంది మృతి  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    10:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వాయు కాలుష్యం (Air Pollution) ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద ప్రమాదంగా మారింది.

    వేగంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, కార్చిచ్చుల వంటివి గాలి కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా గుర్తించబడుతున్నాయి.

    అడవుల మంటలు, పంట వ్యర్థాలను దహనం చేయడం వలన గాలి నాణ్యత మరింత దెబ్బతింటోంది.

    దీని ప్రభావంగా ఏటా సుమారు 15 లక్షల మంది మరణిస్తుంటారని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.

    ఈ ప్రమాదం ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా కనిపిస్తోంది. ది లాన్సెట్‌ జర్నల్‌ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ వివరాలు వెలుగుచూశాయి.

    అంతర్జాతీయ పరిశోధకుల బృందం తెలిపిన మేరకు, అడవుల్లో చెలరేగే మంటలు, పంట కోతలను దహనం చేయడం వలన గాలి కాలుష్యం పెరుగుతుంది.

    వివరాలు 

    ఆఫ్రికాలోనే 40% మరణాలు

    ఈ వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

    2000-2019 మధ్య కాలంలో, కార్చిచ్చు వలన గాలి కాలుష్యంతో 4,50,000 మంది గుండె జబ్బుల వలన, 2,20,000 మంది శ్వాస సంబంధిత రోగాల వలన మరణించారు.

    అయితే ఈ మరణాలు ఎక్కువగా పేద, మధ్యతరహా ఆదాయ దేశాల్లో సంభవిస్తున్నాయి.

    ఆఫ్రికాలోనే 40% మరణాలు జరిగాయని తెలియజేస్తున్నాయి. చైనా, కాంగో, భారత్‌, ఇండోనేషియా, నైజీరియా వంటి దేశాలలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది.

    రానున్న కాలంలో ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఈ ప్రమాదాన్ని నివారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాయు కాలుష్యం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    వాయు కాలుష్యం

    గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు హైదరాబాద్
    దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని  దిల్లీ
    Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు దిల్లీ
    Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025