NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ స్పెషల్‌.. బంగారం కంటే ఉప్పు ఎందుకు ముఖ్యమో తెలుసా?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ స్పెషల్‌.. బంగారం కంటే ఉప్పు ఎందుకు ముఖ్యమో తెలుసా?
    అక్షయ తృతీయ స్పెషల్‌.. బంగారం కంటే ఉప్పు ఎందుకు ముఖ్యమో తెలుసా?

    Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ స్పెషల్‌.. బంగారం కంటే ఉప్పు ఎందుకు ముఖ్యమో తెలుసా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 21, 2025
    10:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతేడాది వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. 2025లో ఈ పవిత్ర రోజును ఏప్రిల్ 30న జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు.

    జ్యోతిషశాస్త్రం ప్రకారం, అక్షయ తృతీయను స్వయంసిద్ధ ముహూర్తమని పిలుస్తారు. ఎందుకంటే ఈరోజున ఏ శుభ కార్యమైనా ప్రత్యేకమైన ముహూర్తం చూసే అవసరం లేకుండా నిర్వహించవచ్చు.

    ఈ ప్రత్యేక దినాన అనేక వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు. అందులో ఒకటి ఉప్పు కూడా. చాలామంది ఈ రోజు ఉప్పు కొనడం వెనుక ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకోవాలనుకుంటారు.

    ఈరోజు పరశురామ జయంతి కూడా జరుపుకుంటారు.

    ఈ సందర్భంలో లక్ష్మీ దేవిని ప్రత్యేక పూజలతో ఆరాధించటం ఒక సంప్రదాయం. దీనివల్ల శాంతి, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు.

    Details

    అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలి?

    ఈ రోజు బంగారం కొనడం ఇంటికి అదృష్టం తెస్తుందని నమ్మకం ఉంది.

    అలాగే ఉప్పు కొనడం వల్ల జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని, దాన్ని దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఈ రోజు ఉప్పును కొని దానం చేసే సంప్రదాయం ఉంది.

    ఎలాంటి ఉప్పు కొనాలి?

    అక్షయ తృతీయ రోజున సాధారణ రాతి ఉప్పును కొనడం చాలా శుభంగా పరిగణిస్తారు. ఇది లక్ష్మీ దేవిని ప్రసన్నం చేస్తుందని విశ్వాసం ఉంది.

    అంతేకాదు రాతి ఉప్పు వాస్తు దోషాలను కూడా తొలగించగలదని నమ్ముతారు.

    దీనికోసం ఆ ఉప్పును బాత్రూంలో గాజు గిన్నెలో ఉంచడం మంచిదని చెబుతారు. అలాగే వంటల్లో కూడా ఆ ఉప్పును ఉపయోగించవచ్చు.

    Details

    రాతి ఉప్పు కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు

    రాతి ఉప్పును భౌతిక సుఖాల అధిపతి శుక్రుడు, మానసిక ప్రశాంతతకు కారణమైన చంద్రుడికి సంబంధించి చూస్తారు.

    అందువల్ల, అక్షయ తృతీయ రోజున ఈ ఉప్పును కొనడం వల్ల సంపద, శాంతి, మానసిక సంతృప్తి లభిస్తాయని నమ్మకం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అక్షయ తృతీయ

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    అక్షయ తృతీయ

    Akshaya Tritiya 2025 : అక్షయ తృతీయకు బంగారాన్నిఇలా కూడా కొనొచ్చని తెలుసా? బిజినెస్
    Akshaya Tritiya 2025: అక్షయ తృతీయకు కొనుగోలు చేసే బంగారం హాల్‌మార్కింగ్‌ను ఎలా చెక్‌ చేయాలో తెలుసా? బిజినెస్
    Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఈ రోజున తప్పకుండా బంగారం కొనాలా? లేకపోతే ఏమవుతుంది?  లైఫ్-స్టైల్
    Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..! లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025