NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2025.. ఎందుకు చేయాలి? ఎప్పుడు మొదలవుతుంది? పూర్తి వివరాలు ఇవే! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2025.. ఎందుకు చేయాలి? ఎప్పుడు మొదలవుతుంది? పూర్తి వివరాలు ఇవే! 
    చార్ ధామ్ యాత్ర 2025.. ఎందుకు చేయాలి? ఎప్పుడు మొదలవుతుంది? పూర్తి వివరాలు ఇవే!

    Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2025.. ఎందుకు చేయాలి? ఎప్పుడు మొదలవుతుంది? పూర్తి వివరాలు ఇవే! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 14, 2025
    11:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో చార్ ధామ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది.

    ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ అనే నాలుగు పవిత్ర ధామ్‌లను ఈ యాత్రలో భాగంగా సందర్శిస్తారు.

    ఈ యాత్రను చేయడం ద్వారా మోక్షం లభిస్తుందని, భక్తులు పాపాల నుంచి విముక్తి పొందుతారని గాఢమైన నమ్మకం ఉంది.

    అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్రను తప్పనిసరిగా చేయాలనే ఆకాంక్ష చాలా మంది హిందువుల్లో ఉంటుంది.

    Details

    2025లో చార్ ధామ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది?

    ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభమవుతుంది.

    యమునోత్రి, గంగోత్రి ధామ్‌లు ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి.

    కేదార్‌నాథ్ తలుపులు మే 2న తెరుచుకోనున్నాయి.

    బద్రీనాథ్ తలుపులు మే 4న తెరుచుకుంటాయి.

    ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

    చార్ ధామ్ యాత్ర అంటే ఏమిటి?

    చార్ ధామ్ యాత్ర అనేది హిమాలయాల్లో ఉన్న నాలుగు ప్రధాన హిందూ పవిత్ర క్షేత్రాలకు చేసే ఆధ్యాత్మిక ప్రయాణం.

    ఈ యాత్ర క్రమం ఇలా ఉంటుంది

    1. యమునోత్రి

    2. గంగోత్రి

    3. కేదార్‌నాథ్

    4. బద్రీనాథ్

    Details

    చార్ ధామ్ యాత్ర ప్రాముఖ్యత ఏమిటి?

    పాపాల విముక్తి : తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ ఈ యాత్ర శుద్ధి చేస్తుందన్న నమ్మకం ఉంది.

    మోక్ష ప్రాప్తి : జనన-మరణ చక్రం నుంచి విముక్తి పొందడానికి ఈ యాత్ర సహాయపడుతుంది.

    ఆత్మజ్ఞానం : ఈ యాత్ర భక్తుల మనస్సును శుద్ధి చేస్తూ, వారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

    ఆధ్యాత్మిక అనుభూతి : హిమాలయాలలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రాలు భక్తులకు ప్రశాంతత, సంతృప్తిని అందిస్తాయి. -

    జీవిత సత్యాన్ని తెలుసుకోవడం : ఈ యాత్ర మనస్సును లోతుగా ప్రభావితం చేస్తూ జీవన ప్రయోజనాన్ని తెలుసుకోవడానికి దోహదపడుతుంది.

    Details

    ఎందుకు సందర్శించాలి?

    సనాతన ధర్మం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా ఈ నాలుగు ధామ్‌లను సందర్శిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

    ముఖ్యంగా కేదార్‌నాథ్ జ్యోతిర్లింగ దర్శనం అనంతరం ఆ నీటిని సేవించిన భక్తుడు పునర్జన్మ నుంచి విముక్తి పొందుతాడన్న విశ్వాసం ఉంది.

    అందుకే ప్రతి హిందువు తన జీవితకాలంలో ఈ యాత్ర చేయాలని ఆశిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    జీవనశైలి

    Health Tips: ఆహరం తిన్న వెంటనే అసౌకర్యంగా ఉందా? ఈ తప్పులు చెయ్యొద్దు! లైఫ్-స్టైల్
    Marriage: నేటి నుంచి మాఘ మాసం ప్రారంభం.. నేటి నుంచి వివాహాల సందడి లైఫ్-స్టైల్
    Star Fruit: స్టార్ ఫ్రూట్ తింటే ఎన్ని లాభాలు ఉంటాయో తెలిస్తే షాక‌వుతారు..! లైఫ్-స్టైల్
    GBS: గులియన్ బారే సిండ్రోమ్ కలకలం.. అప్రమత్త అవసరం లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025