
Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2025.. ఎందుకు చేయాలి? ఎప్పుడు మొదలవుతుంది? పూర్తి వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో చార్ ధామ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనే నాలుగు పవిత్ర ధామ్లను ఈ యాత్రలో భాగంగా సందర్శిస్తారు.
ఈ యాత్రను చేయడం ద్వారా మోక్షం లభిస్తుందని, భక్తులు పాపాల నుంచి విముక్తి పొందుతారని గాఢమైన నమ్మకం ఉంది.
అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్రను తప్పనిసరిగా చేయాలనే ఆకాంక్ష చాలా మంది హిందువుల్లో ఉంటుంది.
Details
2025లో చార్ ధామ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభమవుతుంది.
యమునోత్రి, గంగోత్రి ధామ్లు ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి.
కేదార్నాథ్ తలుపులు మే 2న తెరుచుకోనున్నాయి.
బద్రీనాథ్ తలుపులు మే 4న తెరుచుకుంటాయి.
ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
చార్ ధామ్ యాత్ర అంటే ఏమిటి?
చార్ ధామ్ యాత్ర అనేది హిమాలయాల్లో ఉన్న నాలుగు ప్రధాన హిందూ పవిత్ర క్షేత్రాలకు చేసే ఆధ్యాత్మిక ప్రయాణం.
ఈ యాత్ర క్రమం ఇలా ఉంటుంది
1. యమునోత్రి
2. గంగోత్రి
3. కేదార్నాథ్
4. బద్రీనాథ్
Details
చార్ ధామ్ యాత్ర ప్రాముఖ్యత ఏమిటి?
పాపాల విముక్తి : తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ ఈ యాత్ర శుద్ధి చేస్తుందన్న నమ్మకం ఉంది.
మోక్ష ప్రాప్తి : జనన-మరణ చక్రం నుంచి విముక్తి పొందడానికి ఈ యాత్ర సహాయపడుతుంది.
ఆత్మజ్ఞానం : ఈ యాత్ర భక్తుల మనస్సును శుద్ధి చేస్తూ, వారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.
ఆధ్యాత్మిక అనుభూతి : హిమాలయాలలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రాలు భక్తులకు ప్రశాంతత, సంతృప్తిని అందిస్తాయి. -
జీవిత సత్యాన్ని తెలుసుకోవడం : ఈ యాత్ర మనస్సును లోతుగా ప్రభావితం చేస్తూ జీవన ప్రయోజనాన్ని తెలుసుకోవడానికి దోహదపడుతుంది.
Details
ఎందుకు సందర్శించాలి?
సనాతన ధర్మం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా ఈ నాలుగు ధామ్లను సందర్శిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
ముఖ్యంగా కేదార్నాథ్ జ్యోతిర్లింగ దర్శనం అనంతరం ఆ నీటిని సేవించిన భక్తుడు పునర్జన్మ నుంచి విముక్తి పొందుతాడన్న విశ్వాసం ఉంది.
అందుకే ప్రతి హిందువు తన జీవితకాలంలో ఈ యాత్ర చేయాలని ఆశిస్తారు.