NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / స్మార్ట్ ఫోన్ చూస్తూ తింటే చిక్కులే చిక్కులు .. తస్మాత్ జాగ్రత్త 
    తదుపరి వార్తా కథనం
    స్మార్ట్ ఫోన్ చూస్తూ తింటే చిక్కులే చిక్కులు .. తస్మాత్ జాగ్రత్త 
    స్మార్ట్ ఫోన్ చూస్తూ తింటే చిక్కులే చిక్కులు .. తస్మాత్ జాగ్రత్త

    స్మార్ట్ ఫోన్ చూస్తూ తింటే చిక్కులే చిక్కులు .. తస్మాత్ జాగ్రత్త 

    వ్రాసిన వారు Stalin
    May 18, 2024
    03:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పిల్లలకు ఫుడ్ తినిపించడం అనేది ఈ రోజుల్లో తల్లులకు పెద్ద తలనొప్పిగా మారింది.నోట్లో ముద్ద పెట్టాలంటే చేతిలో ఫోన్ పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది.

    ఏ గోల లేకుండా భోజనం చేయాలంటే చేతిలో ఫోన్ అయినా ఉండాలి. టీవీలో కిడ్స్ ఛానెల్ అయినా పెట్టాలి.

    లేదంటే, వారికి ఫుడ్ తినిపించడం చాలా కష్టం. అయితే, పిల్లలు టీవీ, ఫోన్ చూస్తూ భోజనం చేయడం మంచిది కాదంటోంది తాజా అధ్యయనం.

    అలా చేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటోంది.

    కొంతమంది తల్లులైతే తాము పని చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి స్మార్ట్ ఫోన్ లను ఇచ్చి తమ చిన్నారుల ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేస్తున్నారు.

    Details 

    టీవీ చూస్తూ ఫుడ్ తీసుకుంటే.. బరువు పెరిగే అవకాశం

    ఈ ధోరణిలో మార్పు రావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    టీవీ చూస్తూ ఫుడ్ తింటే ఏమవుతుందంటే?టీవీ లేదంటే ఫోన్ చూస్తూ భోజనం చేయడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.

    పిల్లలు టీవీ చూస్తూ ఫుడ్ తీసుకోవడం వల్ల కడుపు నిండినా అలాగే తింటూనే ఉంటారని చెప్తున్నారు. మోతాదుకు మించి భోజనం తీసుకుంటారట.

    అలా చేయడం ఈజీగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడించారు. పిల్లలు ఎంత వరకు తినవచ్చో తల్లులకు ఓ అవగాహన వస్తుంది.

    735 మంది విద్యార్థులపై అధ్యయనం పోర్చుగల్‌లోని మిన్హో యూనివర్శిటీ 735మంది యువ విద్యార్థులపై జరిపిన పరిశోధనలో ఈవిషయం వెల్లడి అయ్యింది.

    టీవీ లేదంటే ఫోన్ చూస్తూ భోజనం చేసిన విద్యార్థులలో ఊబకాయం ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు.

    Details 

    ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్లో 40 శాతం మందికి ఊబకాయం

    యుకె లెక్కల ప్రకారం 11 సంవత్సరాల వయసున్న పిల్లలో 91 శాతం మంది స్మార్ట్ ఫోన్ చూస్తున్నట్లు తేలింది.

    అంతేకాదు, రోజుకు కనీసం 2 నుంచి 4 గంటల పాటు ఆన్ లైన్ లో గడుపుతున్నారట.

    16 ఏళ్ల లోపు వారు వారానికి కనీసం 5 గంటల పాటు టీవీ చూస్తున్నట్లు ఆఫ్కామ్ వెల్లడించింది.

    అలా కాకుండా పరిమితానికి మించి తింటే లేనిపోని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటమే అని చిన్న పిల్లల డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

    దాదాపు 40 శాతం మంది పిల్లలు ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే సమయానికే అధిక బరువు లేదంటే ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.

    Details 

    టీవీ, ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా మోతాదుకు మించి భోజనం

    "పిల్లలు టీవీ, మొబైల్ ఫోన్‌ చూస్తూ ఫుడ్ తిన్నప్పుడు వాళ్లు ఎంత తింటున్నారో అర్థం కాదు.

    టీవీ, ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా మోతాదుకు మించి భోజనం చేస్తారు.

    పరధ్యానంలో పడి ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు. ఇలా చేయడం పిల్లలకు ఎంతో ప్రమాదకరం.

    వాళ్లు ఈజీగా బరువు పెరుగుతారు. మరికొంత మందిలో ఊబకాయం సమస్య తలెత్తుతుంది" అని పోర్చుగల్‌లోని మిన్హో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధలు చయిత్రి డాక్టర్ అనా డ్వార్టే వెల్లడించారు.

    Details 

    ఈ రోజుల్లో పిల్లలు ఒకసారి, తల్లిదండ్రులు మరోసారి భోజనం

    ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల మాదిరిగా అందరూ కలిసి భోజనం చేసే పరిస్థితి ఈ రోజుల్లో లేదని చైల్డ్ గ్రోత్ ఫౌండేషన్ చైర్మన్ టామ్ ఫ్రై వెల్లడించారు.

    "ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి భోజనాలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ రోజుల్లో పిల్లలు ఒకసారి, తల్లిదండ్రులు మరోసారి భోజనం చేస్తున్నారు.

    పిల్లలు ఫోన్లు, టీవీలకు బాగా అలవాటుపడిపోయారు. వారి ఆరోగ్యం పైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది" అని వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్మార్ట్ ఫోన్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    స్మార్ట్ ఫోన్

    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన నోకియా C12 ప్లస్ భారతదేశం
    ASUS ROG ఫోన్ 7, 7 ప్రో ఫోన్స్ వచ్చేశాయి. ధర ఎంతంటే! ఫోన్
    పిక్సెల్ 6a కంటే గూగుల్ పిక్సెల్ 7a ఫోన్‌లో ఎక్కువ ఫీచర్లు  గూగుల్
    స్మార్ట్ ఫోన్స్ లవర్స్ కు క్రేజీ న్యూస్.. మే నెలలో సరికొత్త ఫోన్స్ లాంఛ్ ఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025