NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Guntur: మిద్దె తోటల పెంపకంలో గుంటూరు వాసుల ఆసక్తి.. నగర కాంక్రీటు జంగిల్‌కు పచ్చందాలు
    తదుపరి వార్తా కథనం
    Guntur: మిద్దె తోటల పెంపకంలో గుంటూరు వాసుల ఆసక్తి.. నగర కాంక్రీటు జంగిల్‌కు పచ్చందాలు
    మిద్దె తోటల పెంపకంలో గుంటూరు వాసుల ఆసక్తి.. నగర కాంక్రీటు జంగిల్‌కు పచ్చందాలు

    Guntur: మిద్దె తోటల పెంపకంలో గుంటూరు వాసుల ఆసక్తి.. నగర కాంక్రీటు జంగిల్‌కు పచ్చందాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    11:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గుంటూరు నగరంలో మిద్దె తోటల అభివృద్ధి విషయంలో స్థానికుల ఉత్సాహం ప్రత్యేకంగా నిలుస్తోంది.

    కాంక్రీటుతో నిండి ఉన్న నగర జీవనశైలికి పచ్చదనాన్ని అందించాలనే తపనతో వారు తమ మిద్దెలను పచ్చగా తీర్చిదిద్దుతున్నారు.

    ఈ నిశ్చలమైన పట్టణ వాతావరణంలో సజీవతను తీసుకొచ్చే ప్రయత్నంలో, వారు తమ ఆసక్తిని సామాజిక మాధ్యమాల ద్వారా సమర్థవంతంగా వినియోగిస్తున్నారు.

    తాజా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వయంగా సాగు చేసుకుంటూ పొందుతున్నారు.

    వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల్లో మిద్దె తోటలపై ముఖ్యమైన సమాచారం, పండిన కూరగాయలు, విత్తనాలు, మొక్కలు పరస్పరం పంచుకుంటున్నారు.

    కొందరు వారు స్వయంగా విత్తన నిధిని ఏర్పాటు చేసుకొని, అందులోని విత్తనాలను ఇతరులతో ఉచితంగా పంచుకుంటున్నారు.

    వివరాలు 

    మొక్కలు ఉచితంగా పంపిణీ

    ప్రతి సీజన్ ప్రారంభంలో సభ్యులు కలసి కొంత డబ్బు కలిపి,కడియం ప్రాంతం నుంచి అవసరమైన మొక్కలను తెప్పించుకుంటున్నారు.

    ప్రస్తుతం నగర వ్యాప్తంగా సుమారుగా 7 ఎకరాల సమాన విస్తీర్ణంలో భవనాలపై మిద్దె తోటల రూపంలో పచ్చదనాన్ని కల్పించామని,మిద్దె తోటల సంక్షేమ సంఘం వాట్సప్ గ్రూప్ నిర్వాహకురాలు కృష్ణకుమారి తెలియజేశారు.

    ఏడాది పొడవునా కూరగాయలు,ఆకుకూరలు సాగు చేసుకునేలా స్పష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తుండటంతో, ఇతర ప్రాంతాల వాసులు కూడా ఈ గ్రూపుల్లో చేరుతున్నారని, 'సీటీజీ' గ్రూప్ నిర్వాహకురాలు రాధ వివరించారు.

    ఈ తోటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం కల్పించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

    దీనిలో భాగంగా,ఒక ప్రత్యేక యాప్‌ను విడుదల చేసి,మొక్కలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు నగర కమిషనర్ శ్రీనివాసులు ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుంటూరు జిల్లా

    తాజా

    Guntur: మిద్దె తోటల పెంపకంలో గుంటూరు వాసుల ఆసక్తి.. నగర కాంక్రీటు జంగిల్‌కు పచ్చందాలు గుంటూరు జిల్లా
    Preity Zinta: టెస్టులకు విరాట్ రిటైర్మెంట్.. స్పందించిన బాలీవుడ్‌ బ్యూటీ ప్రీతి జింటా బాలీవుడ్
    Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. రెండో స్థానానికి స్మృతి మంధాన స్మృతి మంధాన
    BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణస్వీకారం  సుప్రీంకోర్టు

    గుంటూరు జిల్లా

    గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం ఆంధ్రప్రదేశ్
    గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు  రోడ్డు ప్రమాదం
    గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు ఆంధ్రప్రదేశ్
    టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025