LOADING...
Diwali Special: దీపావళి పండగ సంప్రాదాయం ఎలా వచ్చింది.. ఆ కథ ఏంటో మీరు చూసేయండి!
దీపావళి పండగ సంప్రాదాయం ఎలా వచ్చింది.. ఆ కథ ఏంటో మీరు చూసేయండి!

Diwali Special: దీపావళి పండగ సంప్రాదాయం ఎలా వచ్చింది.. ఆ కథ ఏంటో మీరు చూసేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2025
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి సంవత్సరం కార్తీక మాసపు అమావాస్య రోజున దీపావళి పండుగను జోష్‌తో జరుపుకుంటారు. పెద్దలు పూజలు, నోమాల్లో నిమగ్నమై ఉంటే, చిన్నారులు హుషారుగా టపాసులు కాల్చుతూ, స్వీట్లు తినడం ద్వారా మూడు రోజుల పాటు వేడుకలను ఆనందిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. అయితే దీపావళి పండుగ ఎలా వచ్చింది, దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి, అనే విషయాలను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం, నరకాసురుడిని సత్యభామ వధించిన రోజు దీపావళి పండుగగా మారింది.

Details

అహంకారవంతుడుగా మారిన నరకాసురుడు

పూర్వ కాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రజలలో పడవేసాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి వరాహావతారంగా హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని రక్షించాడు. ఆ సంఘటన సమయంలో భూదేవికి ఓ పుత్రుడు జన్మించాడు. విష్ణుమూర్తి, పుత్రుడిలో రాక్షస లక్షణాలు ఉన్నందున, భూదేవికి భవిష్యత్తులో ఆ పుత్రుడు మరణించవలసినట్లు హెచ్చరించారు. భూదేవి తీరుగా తన బిడ్డకు రక్షణ ప్రసాదించాలని కోరింది. ఈ పుత్రుడు నరకాసురుడు. జనకమహారాజు పర్యవేక్షణలో అతను పెద్దయ్యాడు. నరకాసురుడు కామాఖ్య పట్నం రాజ్యాన్ని పరిపాలిస్తూ అమ్మవారిని తల్లిలాగా గౌరవించేవాడు. కానీ, కొద్దిగా కాలం తరువాత నరకాసురుడు అసభ్య, అహంకారవంతుడుగా మారి, ఇతర రాజ్యాలపై దాడులు చేయడం మొదలుపెట్టాడు.

Details

నరకాసున్ని బాణంలో వధించిన సత్యభామ

స్త్రీలను బంధించగా, స్వర్గ దేవతలను కూడా అవమానించాడు. దేవతలు, విష్ణుమూర్తి వద్దకు వెళ్లి నరకాసురుడిని సంహరించమని ప్రార్థించగా, భూదేవి సత్యభామగా అవతరించి శ్రీకృష్ణుడిని వివాహమాడి, యుద్ధానికి వెళ్లాలని నిర్ణయించింది. యుద్ధం మధ్యలో విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావంతో నరకాసురుడిని కేవలం భర్త మూర్చపోయినట్లు నటిస్తూ, చివరగా సత్యభామ బాణం వేశి సంహరించింది. అతని చనిపోయిన రోజును నరకచతుర్దశి అని పిలుస్తారు. ఆ రోజు అమావాస్య కావడంతో, భక్తులు దీపాలు వెలిగించి ఆహ్వానం పలికారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసం కృష్ణ చతుర్దశి రోజు దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆ రోజు నరకాసుర బొమ్మలు తయారు చేసి వాటిని కాల్చే సంప్రదాయం కొనసాగుతోంది.